Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికవ్వాలన్నదే సీడబ్ల్యూసీ కోరిక అని ఆమె అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా గెలిచిన కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అభ్యర్థించిందని చెప్పారు.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఆయన చేసిన ‘భారత్ జోడోయాత్ర’ని ప్రశంసించింది. ఆయన ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపుగా అభివర్నించింది. లక్షాలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లను ఆకర్షించిందని తీర్మానం పేర్కొంది. రాజ్యాంగ పరిరక్షణ 2024 ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిందని చెప్పింది. ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల ఆందోళనలు విన్న రాహుల్జీ యాత్రల పరిణామమే ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా ప్రతిధ్వనించిన పంచన్యాయ్ మేనిఫెస్టో హామీ కార్యక్రమని చెప్పింది.
శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అవ్వాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావడం 140 కోట్ల మంది భారతీయుల కల అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో వరసగా ఆ పార్టీ 44, 52 సీట్లను మాత్రమే గెలుచుంది. 2024 ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!