Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికవ్వాలన్నదే సీడబ్ల్యూసీ కోరిక అని ఆమె అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా గెలిచిన కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అభ్యర్థించిందని చెప్పారు.
Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు..
Also Read
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఆయన చేసిన ‘భారత్ జోడోయాత్ర’ని ప్రశంసించింది. ఆయన ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపుగా అభివర్నించింది. లక్షాలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లను ఆకర్షించిందని తీర్మానం పేర్కొంది. రాజ్యాంగ పరిరక్షణ 2024 ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిందని చెప్పింది. ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల ఆందోళనలు విన్న రాహుల్జీ యాత్రల పరిణామమే ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా ప్రతిధ్వనించిన పంచన్యాయ్ మేనిఫెస్టో హామీ కార్యక్రమని చెప్పింది.
శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అవ్వాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావడం 140 కోట్ల మంది భారతీయుల కల అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో వరసగా ఆ పార్టీ 44, 52 సీట్లను మాత్రమే గెలుచుంది. 2024 ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచింది.
తాజావార్తలు
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!