ఇవాళ పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపీలను సస్పెన్షన్ చేసిన వ్యవహారం కుదిపేస్తుంది. పార్లమెంట్ నుంచి రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు.
తెలంగాణలోని ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికుల నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు లోపలికి అనుమతించాలని నిరసనకు దిగారు. వారంతా.. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా.. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అస్సలు వినడం లేదు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ..…
Nizam College Student: నిజాం కళాశాల విద్యార్థులు సమ్మెకు దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో చాలా మంది విద్యార్థులను పరీక్ష రాకుండా అడ్డుకుంటున్నారని నిజాం కాలేజీ యాజమాన్యంపై ఆరోపించారు.
బెంగాల్ నుండి 4వేల మంది MNREGA కార్మికులతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు రైలులో ఢిల్లీకి బయల్దేరారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీపై ఇప్పటికే చాలా విమర్శుల ఉన్నాయి. రాష్ట్రంలో మంచి నీరుకైనా కరువు రావచ్చు కానీ మద్యానికి కొదవ లేదూ అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నో సార్లు విమర్శలు గుప్పించాయి కూడా. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రం లో శాంతినగర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలియజేశాడు. కూరగాయల బండిపై కూరగాయాలతో పాటు బీరు, వీస్కీ బాటిల్ కు కూడా అమ్ముతూ కేకలు వేశాడు. దీనికి…
అంగన్వాడీల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో అటు పోలీసులు ఇటు అంగన్వాడీల మధ్య వివాదం చెలరేగింది.