Nizam College Student: ఫీజులు కడతాం పరీక్షకు అనుమతివ్వండి.. నిజాం విద్యార్థుల ఆందోళన
Nizam College Student: నిజాం కళాశాల విద్యార్థులు సమ్మెకు దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో చాలా మంది విద్యార్థులను పరీక్ష రాకుండా అడ్డుకుంటున్నారని నిజాం కాలేజీ యాజమాన్యంపై ఆరోపించారు. ఫీజుల చెల్లింపు విషయంలో గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. అప్పుడు కూడా ఫీజు కట్టిన తర్వాతే పరీక్షకు యాజమాన్యం అనుమతి ఇచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా యాజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజు చెల్లించాలని పదిరోజుల గడువు ఇస్తే నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్న ఫీజు అంశాన్ని ముందుకు తెచ్చి సెమిస్టర్ పరీక్షలు రాయకుండా యాజమాన్యం అడ్డుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Saindhav: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం: వెంకటేష్
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు కూడా పరీక్షను బహిష్కరించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించలేదు. నిజాం కళాశాల యాజమాన్యం ఈ 15 మందిని పరీక్షకు అనుమతించలేదు. ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు కూడా పరీక్షకు వెళ్లని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఫీజు చెల్లించని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తేనే తాము కూడా పరీక్ష రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఫీజు చెల్లించకుంటే పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు మరింత ఆందోళనకు దిగడంతో నిజాం కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అబిడ్స్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులను నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!