Nizam College Student: ఫీజులు కడతాం పరీక్షకు అనుమతివ్వండి.. నిజాం విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam College Student: నిజాం కళాశాల విద్యార్థులు సమ్మెకు దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో చాలా మంది విద్యార్థులను పరీక్ష రాకుండా అడ్డుకుంటున్నారని నిజాం కాలేజీ యాజమాన్యంపై ఆరోపించారు. ఫీజుల చెల్లింపు విషయంలో గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. అప్పుడు కూడా ఫీజు కట్టిన తర్వాతే పరీక్షకు యాజమాన్యం అనుమతి ఇచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా యాజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజు చెల్లించాలని పదిరోజుల గడువు ఇస్తే నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్న ఫీజు అంశాన్ని ముందుకు తెచ్చి సెమిస్టర్ పరీక్షలు రాయకుండా యాజమాన్యం అడ్డుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Saindhav: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం: వెంకటేష్
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు కూడా పరీక్షను బహిష్కరించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించలేదు. నిజాం కళాశాల యాజమాన్యం ఈ 15 మందిని పరీక్షకు అనుమతించలేదు. ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు కూడా పరీక్షకు వెళ్లని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఫీజు చెల్లించని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తేనే తాము కూడా పరీక్ష రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఫీజు చెల్లించకుంటే పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు మరింత ఆందోళనకు దిగడంతో నిజాం కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అబిడ్స్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులను నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..
తాజావార్తలు
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!