Nizam College Student: ఫీజులు కడతాం పరీక్షకు అనుమతివ్వండి.. నిజాం విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam College Student: నిజాం కళాశాల విద్యార్థులు సమ్మెకు దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో చాలా మంది విద్యార్థులను పరీక్ష రాకుండా అడ్డుకుంటున్నారని నిజాం కాలేజీ యాజమాన్యంపై ఆరోపించారు. ఫీజుల చెల్లింపు విషయంలో గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. అప్పుడు కూడా ఫీజు కట్టిన తర్వాతే పరీక్షకు యాజమాన్యం అనుమతి ఇచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా యాజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజు చెల్లించాలని పదిరోజుల గడువు ఇస్తే నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్న ఫీజు అంశాన్ని ముందుకు తెచ్చి సెమిస్టర్ పరీక్షలు రాయకుండా యాజమాన్యం అడ్డుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Saindhav: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం: వెంకటేష్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు కూడా పరీక్షను బహిష్కరించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించలేదు. నిజాం కళాశాల యాజమాన్యం ఈ 15 మందిని పరీక్షకు అనుమతించలేదు. ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు కూడా పరీక్షకు వెళ్లని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఫీజు చెల్లించని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తేనే తాము కూడా పరీక్ష రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఫీజు చెల్లించకుంటే పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు మరింత ఆందోళనకు దిగడంతో నిజాం కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అబిడ్స్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులను నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?