Nayanthara Controversy: నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా..? సీఎంను టార్గెట్ చేయబోయి ఇరుక్కుపోయిన ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా డీఎంకే నేత, ఎంపీ సీవీ షణ్ముగన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి వ్యసనం కారణంగా హత్యలు, దోపిడీలు, ఇతర నేరాలు పెరుగుతున్నాయని కూడా ఆరోపించారు.
అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన “మీ కలలు చెప్పండి, మేము నెరవేర్చుతాం” అనే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మీ కలలు చెప్పండి, నేను నెరవేర్చుతాను అని సీఎం అంటున్నారు. అయితే నాకు నయనతార కావాలి… నా కలను నెరవేరుస్తారా?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్నవారిలో చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా మాట్లాడారని పలువురు మండిపడ్డారు.
Also Read
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
వివాదం పెరగడంతో అనంతరం షణ్ముగం వివరణ ఇచ్చారు. ప్రసంగ సమయంలో పొరపాటున ఒక నటి పేరు ప్రస్తావించానని, ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదని చెప్పారు. జరిగిన ఘటనకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. మొత్తంగా ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది.. మొన్నటి మొన్న ఓ బీజేపీ నేత.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ఇప్పుడు.. అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..
మరోవైపు, నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించింది నడిగర సంఘం.. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలను మేం ఒప్పుకోం అని స్పష్టం చేసింది.. బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అని హితవు చెప్పింది.. బేషరతుగా నయనతారకు క్షమాపణ చెప్పాలని అని నడిగరసంఘం డిమాండ్ చేసింది..
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!