Nayanthara Controversy: నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా..? సీఎంను టార్గెట్ చేయబోయి ఇరుక్కుపోయిన ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Controversy: తమిళనాడులో రాజకీయ వర్గాల్లో ఒక వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి నయనతార పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ All India Anna Dravida Munnetra Kazhagam (అన్నాడీఎంకే) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. విల్లుపురంలో జరిగిన ఈ నిరసనకు అన్నా డీఎంకే నేత, ఎంపీ సీవీ షణ్ముగన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వాటిని అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి వ్యసనం కారణంగా హత్యలు, దోపిడీలు, ఇతర నేరాలు పెరుగుతున్నాయని కూడా ఆరోపించారు.
అదే సమయంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన “మీ కలలు చెప్పండి, మేము నెరవేర్చుతాం” అనే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మీ కలలు చెప్పండి, నేను నెరవేర్చుతాను అని సీఎం అంటున్నారు. అయితే నాకు నయనతార కావాలి… నా కలను నెరవేరుస్తారా?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్నవారిలో చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలను అవమానించేలా మాట్లాడారని పలువురు మండిపడ్డారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
వివాదం పెరగడంతో అనంతరం షణ్ముగం వివరణ ఇచ్చారు. ప్రసంగ సమయంలో పొరపాటున ఒక నటి పేరు ప్రస్తావించానని, ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదని చెప్పారు. జరిగిన ఘటనకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. మొత్తంగా ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది.. మొన్నటి మొన్న ఓ బీజేపీ నేత.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ఇప్పుడు.. అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..
మరోవైపు, నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించింది నడిగర సంఘం.. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలను మేం ఒప్పుకోం అని స్పష్టం చేసింది.. బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికావు అని హితవు చెప్పింది.. బేషరతుగా నయనతారకు క్షమాపణ చెప్పాలని అని నడిగరసంఘం డిమాండ్ చేసింది..
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..