పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ,…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ.. ఎన్నో ఏళ్ల తరువాత డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తుండగా.. మరికొంతమంది ఈ సినిమాపై జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజగా రాధేశ్యామ్ ప్రమోషన్…
రాధేశ్యామ్.. ప్రభాస్.. పూజా హెగ్డే.. థమన్.. యూవీ క్రియేషన్స్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇవే పేర్లు వినిపిస్తున్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని మార్చి 11 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ప్రభాస్, పూజ హెగ్డే క్షణం కూడా బిజీగా లేకుండా కష్టపడుతున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో…
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఆఫ్లైన్ ప్రమోషన్స్లో బిజీగా ఉండగా, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఆన్లైన్లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆదివారం రాధాకృష్ణ అభిమానుల ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. ఈ తాజా సెషన్లో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో చిత్రాన్ని మార్చమని ఒక అభిమాని అడిగాడు. టీమ్కి సమాచారం ఇస్తానని ఆ వ్యక్తికి రిప్లై…
ఏపీ;లో టికెట్ ధరలు, థియేటర్ల సమస్యలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో అందరి దృష్టి ఆంధ్రా ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు జారీ చేస్తుంది ? అనే దానిపైనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త జీవో బెనిఫిట్ అందుకునే ఫస్ట్ తెలుగు మూవీ “రాధేశ్యామ్” అంటున్నారు. Read also : Radhe Shyam : టైటానిక్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాధే శ్యామ్లో మీ పాత్ర గురించి చెప్పండి?ఈ సినిమాలో నా పాత్ర పేరు ప్రేరణ. డిఫరెంట్ షేడ్స్, డెప్త్, ఎమోషన్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ప్రేరణ…
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫుడ్ లో ప్రభాస్ ఫేవరెట్ డిష్ ఏంటో వెల్లడించింది ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె భక్తి కార్యకలాపాలపై, సినిమా గురించిన దృక్పథంపై తన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. Read Also : Prabhas : సోషల్ మీడియాకు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్గా ఉంటానని,…