బాహుబలికి ముందు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇక ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాన్ వరల్డ్ స్టార్గా మారడం పక్కా అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు రాబోతోంది.. డైరెక్టర్ ఎవరు.. ఆ వార్తల్లో ఎంతవరకు నిజముంది..? ప్రస్తుతం…
‘బాహుబలి’ సిరీస్ కారణంగా జాతీయ స్థాయిలో స్టార్డమ్ వచ్చినప్పటి నుంచీ ప్రభాస్తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ఆల్రెడీ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేసేశాడు. ఈ సినిమా ఒప్పందం సమయంలోనే సిద్ధార్థ్ ఆనంద్తోనూ ఓ సినిమాకి ప్రభాస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలొచ్చాయి. అంతే, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని, ఆ వార్తలు కేవలం రూమర్స్ అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం…
ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక…
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్…
ఆలిండియా స్టార్ ప్రభాస్ లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో.. దర్శకుడు మారుతి సినిమా ఒకటి. వీరి కాంబోలో సినిమా ఉండనుందన్న వార్తొచ్చి చాలాకాలమే అవుతున్నా.. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్న విషయంపైనే స్పష్టత రాలేదు. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట! తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమా రూపొందనుంది కాబట్టి, ఎక్కువ సమయం వృధా చేయకుండా చకచకా చిత్రీకరణను…
‘కేజీఎఫ్: చాప్టర్2’ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ సముద్రంలో ముగించిన విషయం తెలిసిందే! నిజానికి.. రాకీ భాయ్ అంత పెద్ద షిప్ వేసుకొని దూసుకెళ్ళడాన్ని చూసినప్పుడు, ఏదో పెద్ద యాక్షన్ సీక్వెన్సే ప్లాన్ చేసినట్టు ఉన్నారని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా రాకీ భాయ్పై బాంబుల వర్షం కురిపించి, అతను మునిగిపోయే సీన్తో ప్రశాంత్ నీల్ ముగించాడు. ఆశించిన యాక్షన్ సీన్ లేకపోవడంతో, ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. అయితే.. సలార్లో అలాంటి డిజప్పాయింట్మెంట్ ఉండదని…
‘రాధేశ్యామ్’ వంటి ఫ్లాప్ తర్వాత.. ‘సలార్’ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ కూడా తన అప్కమింగ్ ఫిల్మ్స్ విషయంలో.. చాలా కేర్ తీసుకుంటున్నారట. ముఖ్యంగా ‘సలార్’ సినిమా తన అభిమానుల అంచనాలను మించేలా ఉండాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుడదని సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ కూడా ‘కెజియఫ్’ని మించి సలార్ను రూపొందింస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన అఫీషియల్, అన్…
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే.. చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ.. గత కొన్నేళ్లుగా ప్రతీ నెల సోషల్ మీడియాలో.. వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మేల్, ఫీమేల్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది. మరి ఈ సర్వేలో ఎవరు నెంబర్ ప్లేస్లో నిలిచారు..? ఓర్మాక్స్…
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్.. సలార్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా కెజియఫ్తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై ఓ రేంజ్లో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ విషయంలో.. మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. మరి సలార్ బడ్జెట్ ఎంత.. ఇప్పుడెంత పెరిగింది..? ప్రస్తుతం ప్రభాస్కున్న భారీ లైనప్ మరో హీరోకు లేదనే చెప్పాలి. డార్లింగ్ చేతిలో…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రబస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న విషయం విదితమే.. అందులో ఒకటి ‘సలార్’. కెజిఎఫ్ చిత్రంతో ఒన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ తరుపున శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై ఇప్పటికే చాలా రోజులవుతుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ ను పూర్తిచేశాడు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ను…