Amit Shah: ప్రభాస్ తో అమిత్ షా భేటీ.. కారణం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah:టాలీవుడ్ కు బీజేపీ కి అవినాభావ సంబంధం ఏమైనా ఉందా..? అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.. టాలీవుడ్ స్టార్స్ ను బీజేపీ నేతలు భేటీ అవ్వడంతో ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్, ఆ తరువాత నితిన్, కొన్నిరోజుల్లో నిఖిల్.. ఇలా వరుస హీరోలను.. బీజేపీ నేతలు ఎందుకు కలుస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా కనపడుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలో అమిత్ షా- ప్రభాస్ తో భేటీ కానున్నరాట. అయితే ప్రభాస్ కలవడం వెనుక రాజకీయం ఏది లేదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే. కృష్ణంరాజు వాజ్ పేయ్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కుటుంబాన్ని అమిత్ షా పరామర్శించనున్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిధిగా అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఇక సెప్టెంబర్ 16 న కృష్ణంరాజు సంస్కరణ సభ జరగనుంది. దీంతో హైదరాబాద్ వచ్చిన వెంటనే అమిత్ షా.. ప్రభాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారట. ఆ తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పూర్తిచేసి యంగ్ హీరో నిఖిల్ తో భేటీ కానున్నారని అంటున్నారు. ప్రభాస్ విషయం పక్కన పెడితే.. నిఖిల్ తో అమిత్ షా కార్తికేయ 2 గురించే మాట్లాడతాడా..? ప్రచారం కోసం రమ్మని అడుగుతాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అమిత్ షా రాక ఎన్నో అనుమానాలకు దారి ఇస్తోంది.. మరి వాటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..