POCSO Case: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. సహచర బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఆ బాలికల వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నెంబర్లను ఇతర విద్యార్థులకు ఇచ్చి వేధించాడు సదరు విద్యార్థి.
గంజాయి.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం. గంజాయి నిర్మూళనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ధూల్ పేట గంజాయి డాన్ అంగూర్ బాయి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఒరిస్సా గంజాయి లేడీ డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఐదు కేసుల్లో నిందితురాలిగా ఉన్న…
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు.
ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
Road Accident: యాదగిరిగుట్ట జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు (మార్చ్ 26) తెల్లవారు జామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ను వెనుక నుంచి రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి.
లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి... తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Lawyer Murder Case: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.
ఈ నెల 27వ తేదీన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది.. ఈ సమయంలో నాటకీయ పరిణాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ఫిర్యాదు ఆధారంగా ఎంపీపీ అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సుబ్బారావుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
ASHA Workers Protest: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
Hyderabad MMTS: సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటన కలకలం రేపుతుంది.