Lady Aghori: కుటుంబంలో అఘోరీ అలజడి.. అసలేం జరిగింది..!
- పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టిన లేడీ అఘోరీ..
- పోలీసులను ఆశ్రయించిన యువతి తండ్రి..
- వశీకరణం చేసి తన కూతురు తీసుకెళ్లిందని ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను మాయమాటలు చెప్పి అఘోరీ తీసుకువెళ్లాడని యువతి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు నెలల క్రితం అఘోరీ మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చినా పోలీసులు లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో అఘోరీ హైవేపై గందరగోళం చేయటంతో విషయాన్ని అఘోరీ గురువుకు చేరవేశారు. దీంతో ఈ విషయాన్ని వెంటనే అఘోరీ డ్రైవర్ ఆమె గురువుకి చెప్పటంతో అఘోరీకి సాయం చేయాలని తనకు పరిచయం ఉన్న శ్రీవర్షిని అన్నలకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే శ్రీవర్షిణి అన్నలు ఇద్దరు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కబెట్టారు.
Read Also: GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
అయితే, ఈ ఘటన జరిగిన రోజు అఘోరీ శ్రీవర్షిణి ఇంటికి వెళ్లి అక్కడే ఉంది. ఆ తర్వాత నుంచి తన కారు రిపేర్ లో ఉందని ఇతరత్రా కారణాలు చెప్పి వారి ఇంట్లోనే అఘోరీ ఉంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రీవర్షిణితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పింది. తన దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పింది. శ్రీవర్షిణిని ఒంటిరిగా కూర్చోబెట్టి వశీకరణ ముద్రలు ఆమెపై వేయటంతోపాటు పసరును అన్నంలో కలిపి వెళ్లిపోయింది అఘోరీ. ఆ తర్వాత రోజు నుంచి శ్రీవర్షిని తేడాగా ప్రవర్తించటంతో తండ్రి కోటయ్య ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్షలు జరిపి రెండు రోజులకు సరిపడా కోర్సు టాబ్లెట్స్ ఇచ్చారు. శ్రీవర్షిణి ఒక రోజు కోర్సు టాబ్లెట్స్ వాడి రెండో కోర్సు వాడను అని మొండికేసింది. ఆ తర్వాత ఇంటి నుంచి శ్రీవర్షిణి వెళ్లిపోయింది. విజయవాడ బస్టాండ్ కు వెళ్లి తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఫోన్ పేలో 700 వేయించుకుని హైదరాబాద్ వెళ్లింది. విషయం తెలసుకున్న తండ్రి కోటయ్య వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అఘోరీని పిలపించి విచారణ చేశారు.
Read Also: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
శ్రీవర్షిణిని తల్లిదండ్రులకు అప్పజెప్పాలని అఘోరీకి పోలీసులు చెప్పటంతో శ్రీవర్షిణి ఒంటరిగా గుంటూరు జిల్లా మంగళగిరి వచ్చింది. మంగళగిరి పోలీసులను కలిసిన శ్రీవర్షిని తాను మేజర్ ని అని తాను ఇష్టపూర్వకంగానే అఘోరీతో వెళ్తున్నట్టు లికిత పూర్వకంగా రాసిచ్చింది. అదే విషయాన్ని పోలీసులు కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో శ్రీ వర్షిణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని కాపాడాలని.. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!