Lady Aghori: కుటుంబంలో అఘోరీ అలజడి.. అసలేం జరిగింది..!
- పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టిన లేడీ అఘోరీ..
- పోలీసులను ఆశ్రయించిన యువతి తండ్రి..
- వశీకరణం చేసి తన కూతురు తీసుకెళ్లిందని ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Aghori: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తో మంగళగిరికి చెందిన బీటెక్ చదివిన శ్రీవర్షిణి అనే యువతి వెళ్లిపోవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అటు హైదారబాద్ లో ఉన్న వనస్థలిపురంలో, గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను మాయమాటలు చెప్పి అఘోరీ తీసుకువెళ్లాడని యువతి తండ్రి తురిమెల్ల కోటయ్య మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు నెలల క్రితం అఘోరీ మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చినా పోలీసులు లోపలకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో అఘోరీ హైవేపై గందరగోళం చేయటంతో విషయాన్ని అఘోరీ గురువుకు చేరవేశారు. దీంతో ఈ విషయాన్ని వెంటనే అఘోరీ డ్రైవర్ ఆమె గురువుకి చెప్పటంతో అఘోరీకి సాయం చేయాలని తనకు పరిచయం ఉన్న శ్రీవర్షిని అన్నలకు ఫోన్ చేశారు. దీంతో వెంటనే శ్రీవర్షిణి అన్నలు ఇద్దరు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కబెట్టారు.
Read Also: GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
అయితే, ఈ ఘటన జరిగిన రోజు అఘోరీ శ్రీవర్షిణి ఇంటికి వెళ్లి అక్కడే ఉంది. ఆ తర్వాత నుంచి తన కారు రిపేర్ లో ఉందని ఇతరత్రా కారణాలు చెప్పి వారి ఇంట్లోనే అఘోరీ ఉంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రీవర్షిణితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పింది. తన దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పింది. శ్రీవర్షిణిని ఒంటిరిగా కూర్చోబెట్టి వశీకరణ ముద్రలు ఆమెపై వేయటంతోపాటు పసరును అన్నంలో కలిపి వెళ్లిపోయింది అఘోరీ. ఆ తర్వాత రోజు నుంచి శ్రీవర్షిని తేడాగా ప్రవర్తించటంతో తండ్రి కోటయ్య ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్షలు జరిపి రెండు రోజులకు సరిపడా కోర్సు టాబ్లెట్స్ ఇచ్చారు. శ్రీవర్షిణి ఒక రోజు కోర్సు టాబ్లెట్స్ వాడి రెండో కోర్సు వాడను అని మొండికేసింది. ఆ తర్వాత ఇంటి నుంచి శ్రీవర్షిణి వెళ్లిపోయింది. విజయవాడ బస్టాండ్ కు వెళ్లి తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఫోన్ పేలో 700 వేయించుకుని హైదరాబాద్ వెళ్లింది. విషయం తెలసుకున్న తండ్రి కోటయ్య వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా అఘోరీని పిలపించి విచారణ చేశారు.
Read Also: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
శ్రీవర్షిణిని తల్లిదండ్రులకు అప్పజెప్పాలని అఘోరీకి పోలీసులు చెప్పటంతో శ్రీవర్షిణి ఒంటరిగా గుంటూరు జిల్లా మంగళగిరి వచ్చింది. మంగళగిరి పోలీసులను కలిసిన శ్రీవర్షిని తాను మేజర్ ని అని తాను ఇష్టపూర్వకంగానే అఘోరీతో వెళ్తున్నట్టు లికిత పూర్వకంగా రాసిచ్చింది. అదే విషయాన్ని పోలీసులు కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో శ్రీ వర్షిణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని కాపాడాలని.. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. స్థానికంగా ఈ వ్యవహారం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..