ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని…
సొంత బావతో.. 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య.. తండ్రి కేశవులు చనిపోడంతో తల్లితో కలిసి నాగారం రాఘవేంద్రకాలనిలో ఉంటూ, మేస్త్రి పని చేస్తూ జీవనము సాగిస్తున్నాడు. చర్లపల్లిలో నివాసం ఉంటున్న కొండయ్య.. చిన్న కొండయ్యకు మేనమామ వరుస అవుతాడు. దీంతో కొండయ్య దంపతులు గత సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన తమ…
హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన…
హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరోనా…
తెలంగాణలో మరింత లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్డౌన్ అమలుపై సీపీ, ఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. లాక్డౌన్పై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ రోజూ సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారన్న డీజీపీ… అందరూ ఒకేసారి రావడం వల్లే మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. కమిషనర్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు రహదారులపై తిరగాలని డీజీపీ…
రెమిడెసీవర్ ఇంజెక్షన్ లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేసారు ఏపీ పోలీసులు. ఆశ్రం కొవిడ్ కేర్ హాస్పిటల్ నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టిస్తున్నారు పదిమంది ముఠా సభ్యులు. ఆ ముఠా దగ్గర నుండి 40 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, 1లక్ష 45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవదిలో రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న మూడు ముఠా లను అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు కొరడా దుళిపిస్తున్న…
ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆ మనిషిని ఖననం చేశారో ఆ సమాధిని తవ్వి ఎముకలకు సేకరించారు. డీఎన్ఏ ద్వారా ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది… తెలుసుకుందాం. 70 ఏళ్ల క్రితం అంటే 1948 డిసెంబర్ 1 వ తేదీన అడిలైడ్ సమీపంలోని సోర్ధమాన్ బీచ్ లో ఓ మృతదేహం కనిపించింది. అతని గురించి…
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందడం ఛత్తీస్గడ్లో కలకలం సృష్టిస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా సిల్గర్ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 3 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు.. తమ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగారు.. అయితే.. నిరసన కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది… పోలీసులతో గ్రామస్తులు ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుండగా… ప్రతిఘటించడానికి కాల్పులకు దిగారు పోలీసులు.. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్తులు అక్కడిక్కడే మృతిచెందారు.. దీంతో.. గ్రామంలో ఉద్రిక్త…