యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆశిశ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆశిశ్ మిశ్రాను విచారణ చేస్తున్నారు. లఖింపూర్లో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 3 తేదీన నిరసనలు చేస్తున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి…
ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…
విశాఖపట్నంలో మైనర్ బాలిక మృతి కేసులో సంచలనంగా మారింది.. అయితే, అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్మెంట్ వాచ్మెన్ కుమార్తె పావని డెత్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. రాత్రివేళ తల్లిదండ్రులు తనను ఒంటరిగా అబ్బాయితో చూస్తారన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి వాచ్మెన్గా పని చేస్తున్న పక్క అపార్ట్మెంట్ 101లో ఉంటున్న యువకుడు నగేష్ను కలిసేందుకు బాలిక వెళ్లిందని.. ఇద్దరూ కలిసి మేడపైకి…
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కాటేదాన్ లో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడంటూ స్థానికులు అంటున్నారు. రామ్ చరణ్ ఆయిల్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడ్డాడు యువకుడు. యువకుని పై నుండి దూసుకు వెళ్ళింది కంటైనర్. స్పాట్ లోనే మృతి చెందాడు యువకుడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఆ…
పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డిజిపి, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారు అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర అన్నారు. విజయవాడ కేంద్రంగానే హెరాయిను వ్యాపారం జరిగింది అనడానికి ఆషీ ట్రేడింగ్ సుధాకర్ సంస్థ కట్టిన జిఎస్టీలే రుజువు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డీజీపీ హెరాయిన విషయంలో వైసీపీ నాయకులను కాపాడటం సిగ్గు చేటు. గత నెల 20 న హెరాయిన్ పట్టుబడితే నిన్న సీఎం…
చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి 500 కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేసారు. జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన ఈ భూ కుంభకోణం జరిగింది. అయితే మొత్తం 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320ఎకరాల స్థలం పేర్ల మార్పు చేసారు. ఒకే రోజు ఆన్ లైన్ లో జరిగిపోయింది ఈ భూ దందా. ఈ కేసులో విఆర్వో మోహన్ పిళ్ళై ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆన్లైన్లో…
తెలుగు అకాడమీ కేసులో ముగ్గురు కీలక పాత్ర పోషించినట్లు గా పోలీసుల విచారణలో బయట పడింది. ముగ్గురు దొరికితే కానీ అసలు రహస్యం బట్టబయలు కాదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్వలి కి ఈ ముగ్గురు సహకరించినట్లు గా విచారణలో వెలుగుచూసింది. రాజకుమార్, శ్రీనివాసు, సోమ శేఖర్ లు ఈ కేసులో కీలకంగా ఉన్నారని సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. మస్తాన్వలి నిధులను డ్రా చేసి ఇచ్చిన తర్వాత ఈ…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ జంగ్సైరన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ధ భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులంటా దిల్షుఖ్ నగర్ రావాలని, దిల్షుఖ్ నగర్ లో సాయంత్రం 4 గంటల నుంచి ఎలాగైనా ర్యాలీని చెపట్టితీరుతామని రేవంత్ ప్రకటించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పారు. కట్టుదిట్టమైన…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేవని చెబుతూనే.. ఏకంగా పవన్ కాన్వాయ్ని అడ్డుకున్నారు పోలీసులు.. రాజమండ్రి క్వారీ సెంటర్కు పవన్ కల్యాణ్ కాన్వాయ్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.. పవన్ కాన్వాయ్ ను అడ్డుకోవద్దు అంటూ పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని పవన్.. తన కారు టాప్పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఆ తర్వాత…
మియపూర్ హనీఫ్ కాలనిలో దారుణం చోటు చేసుకుంది. కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న నందిని అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉండడంతో నందినికి సెల్ ఫోన్ ఇచ్చాడు తండ్రి. అయితే సెల్ ఫోన్ లో బాలిక తరుచూ చాటింగ్ చేస్తున్నాట్లు గుర్తించి మందలించారు కుటుంబ సభ్యులు. వరుసకు మామ అయ్యే వ్యక్తితో తరచుగా బాలిక చాట్ చేస్తున్నట్లు గమనించారు పేరెంట్స్. అయితే బలైన చెప్పిన మాట వినకపోవడంతో…