తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో చైన్ స్నాచర్ ఎన్ కౌంటర్ ను చేసారు పోలీసులు. అయితే తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురి చేసాడు చైన్ స్నాచర్. శ్రీపెరంబుదూర్లోని ఓ టోల్ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు ఝార్ఘండ్కు చెందిన ముర్తాసా. బాధితురాలి ఆరుపులతో స్థానికులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు ముర్తాసా. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా ముర్తాసా కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముర్తాసా మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో ముర్తాసా మద్దతు ఇచ్చిన మరో నిందితుడు నయీమ్ అక్తర్ను అరెస్ట్ చేశారు పోలీసులు.