పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
తెలంగాణ అస్తమా రోగానికి బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం(మందు) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. మృగశిర కార్తె అయిన 9వ తేదిన చేప మందును పంపిణీ చేయనున్నారు.
తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ తీర్మానం సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు.
ఈ మధ్య కాలంలో టోల్గేట్ల దగ్గర గొడవలు పెరిగిపోతున్నాయి. టోల్గేట్ దగ్గర పేమెంట్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవుతుండటంతో ప్రయాణీకులు ఓపిక లేకుండా టోల్ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు.
ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. అతని మంచి డ్రెస్సింగ్ సెన్స్ మరియు సన్ గ్లాసెస్ చూసి కోపోద్రిక్తులైన అగ్రవర్ణ వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీలోని సాక్షి హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు భారీ ఊరట లభించింది. నిందితుడు సాహిల్ సాక్షిని 20కి పైగా పొడిచి చంపిన కత్తిని రిథాలా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులతో తిరుగుతున్నందుకు ముస్లిం యువకులను దారుణంగా కొట్టారు. మంగళూరు జిల్లాలోని సోమేశ్వర్ బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంత్రి మల్లారెడ్డి పోలీసులనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను కోరారు మంత్రి మల్లారెడ్డి. అంతేకాకుండా పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.