Krishna District: కృష్ణాజిల్లాలో అమానుషం.. పెద్ద మనుషుల మాట వినలేదని గ్రామం నుంచి వెలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ తీర్మానం సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని షరతు విధించి చాటింపు వేయించారు పెద్దమనుషులు. వారితో ఎవరైనా మాట్లాడిన విషయాన్ని చెబితే వారికి రూ. 500 బహుమతి కూడా ఇవ్వనున్నట్టు గ్రామ పెద్దమనుషులు చాటింపు వేయించారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో ఘటన జరిగింది.
Read also: CM YS Jagan: రేపు కోనసీమ జిల్లాకు సీఎం జగన్.. విషయం ఇదే..
Also Read
గ్రామంలో రెండు కుటుంబాలకు స్థల వివాదం వచ్చింది. స్థలం వివాదాన్ని గ్రామ పెద్దలు పరిష్కరించే క్రమంలో పెద్ద మనుషుల మాటలను తిరస్కరించినందుకు తుమ్మ వెంకట సీతారామయ్య కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసినట్లు గ్రామ పెద్దలు చాటింపు వేయించారు. చాటింపును వీడియో తీసిన రామకృష్ణ కుటుంబాన్ని కూడా వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ విషయాన్ని చాటింపు వేయించారు. చాటింపును వీడియో తీసిన రామకృష్ణ రావి వారి పాలెం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.
Read also: Vishwak sen : ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న విశ్వక్ సేన్..!!
గ్రామం నుంచి వెలివేసిన రెండు కుటుంబాలతో మాట్లాడిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. వారితో ఎవరైనా మాట్లాడితే చెప్పినందుకు వారికి రూ. 500 బహుమతి ఇవ్వనున్నట్లు పెద్దమనుషులు చాటింపు వేయించారు. తమ రెండు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రెండు కుటుంబాల వారు గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. రెండు కుటుంబాల పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చల్లపల్లి సిఐ రవికుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!