Madhya Pradesh: ఘోరం.. గుర్రంపై దళిత వరుడి ఊరేగింపు.. రాళ్లతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సందర్భంగా గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే వరుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
Read Also: Air India Flight: రష్యాలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
Also Read
- Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
- BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
- Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో సోమవారం సాయంత్రం దళిత వరుడి పెళ్లి ఊరేగింపుపై గుర్రపు స్వారీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో రాళ్లు రువ్వారు. రెండు పోలీసు బృందాలు జోక్యం చేసుకున్న తర్వాత కూడా రాళ్లు రువ్వడం కొనసాగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాడిలో పాల్గొన్న ఓబీసీ వర్గానికి చెందిన 50 మంది నిందితులపై కేసు నమోదు చేశామని, 20 మంది పేర్లను నమోదు చేసినట్లు ఛతర్పూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ సంఘీ తెలిపారు. వరుడు సుమారు 50 మందితో కలిసి ఛతర్పూర్ జిల్లాలోని చౌరాయ్ గ్రామం నుంచి సాగర్ జిల్లా షాఘర్లోని వధువు ఇంటికి సోమవారం సాయంత్రం బయలు దేరాడు. గుర్రంపై వస్తున్న వరుడి ఊరేగింపును గ్రామస్థుల బృందం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వరుడిని గుర్రంపై నుంచి దిగాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతను దిగడానికి నిరాకరించడంతో, కోపోద్రిక్తులైన ప్రజలు ఊరేగింపుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
Read Also: Nepal PM Prachanda: సరిహద్దు సమస్య పరిష్కారానికి నేపాల్, భారత్ చర్చలు జరపాలి..
ఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ రాళ్లు రువ్వడం మాత్రం కొనసాగింది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పోలీసు బృందాలు కొన్ని గంటల తర్వాత జనాన్ని చెదరగొట్టగలిగాయి. ఊరేగింపుకు పోలీసులు భద్రత కల్పించారు. ఆ ఊరేగింపు అర్థరాత్రి గమ్యస్థానానికి చేరుకుంది. నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (దౌర్జన్యాల నిరోధక) చట్టం-1989.. భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. గ్రామంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో కూడా జిల్లాలో ఇదే విధమైన సంఘటన జరిగింది. ఒక కానిస్టేబుల్ పెళ్లికి గుర్రపు స్వారీ చేయకుండా అడ్డుకున్నారు. అతని ఊరేగింపుకు పోలీసు రక్షణ కూడా ఇవ్వబడింది. 100 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
-
Terror Plot: ఢిల్లీ, పంజాబ్లో భారీ దాడులకు కుట్ర.. పాక్ పన్నాగం విఫలం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం రూ.30 కోట్లు.. నేనంటే నేను అంటూ తీవ్ర పోటీ..
-
BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!