Delhi: సాక్షి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని సాక్షి హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు భారీ ఊరట లభించింది. నిందితుడు సాహిల్ సాక్షిని 20కి పైగా పొడిచి చంపిన కత్తిని రిథాలా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాక్షిపై సాహిల్ కత్తితో దాడి చేశాడు. అనంతరం సాక్షిని రాయితో చితకబాది దారుణంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన సాహిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సాక్షికి చెందిన 10 మందికి పైగా స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు. వీరిలో అజయ్ అలియాస్ జబ్రూ, నీతూ, ప్రవీణ్ ఉన్నారు. సాహిల్ మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సీసీటీవీలో కనిపించిన 8 మందిని గుర్తించారు. వారి వాంగ్మూలాలను కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. గురువారం సాహిల్ కు కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. సాహిల్ను పోలీసులు విచారించగా.. అతను హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు సాహిల్ హత్య చేసిన తర్వాత బులంద్షహర్ చేరుకున్న మార్గాన్ని కూడా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కత్తిని రితాలాలోని పొదల్లో పడేశాడు.
Also Read : AP CM Jagan: నేడు సీఎం జగన్ గుంటూరు పర్యటన
సాక్షి శరీరంపై 34 గాయాల గుర్తులు కనిపించాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. షాహాబాద్ డెయిరీలోనే అద్దె ఇంట్లో సాహిల్ తన కుటుంబంతో ఉంటున్నాడు. సాక్షి, సాహిల్ మధ్య సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. అయితే కొంతకాలంగా వీరి రిలేషన్ షిప్ లో గ్యాప్ వచ్చింది. దీనికి కారణం మరో బాలుడు ప్రవీణ్ గా గుర్తించారు. సాక్షి గతంలో ప్రవీణ్తో రిలేషన్షిప్లో ఉంది.. కానీ మళ్లీ అతను సాక్షితో కలిసి తిరుగుతున్నారు. దీంతో అది తట్టుకోలేకపోయిన సాహిల్ సాక్షిని తిరిగి తనతో ఉండాలని కోరాడు.. దీనికి ఆమె నిరాకరించడంతో సాహిల్ పదే పదే సాక్షిని వేదించాడు. దీంతో సాక్షి ఆమె స్నేహితుడు జాబ్రూ సాహిల్ను బెదిరించారు. దీంతో సాక్షిని సాహిల్ హత్య చేశాడు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?