Uttar Pradesh: ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. కర్రలతో కొట్టి చంపిన జనాలు
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి.. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Manchu Manoj: మళ్లీ మా అమ్మ దగ్గరకే.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
వివరాల్లోకి వెళ్తే.. రాంపూర్ మధుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. లోకియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి ఆదివారం ఉదయం ముగ్గురు దొంగలు చొరబడ్డారు. అక్కడ దొంగతనం చేసి బయటపడినప్పటికీ.. మరో ఇంట్లో చోరి చేసేందుకు వెళ్లారు. అయితే ఇంట్లో దొంగలు పడ్డారని గట్టిగా అరిచారు కుటుంబసభ్యులు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు ఇంటిచుట్టూ గుమికూడి పారిపోతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారిని కర్రలు, రాడ్లతో చితకబాదారు.
Read Also: Heavy Rains: అగ్రరాజ్యం అమెరికాపై హరీకేన్ హిల్లరీ తుఫాన్ ఎఫెక్ట్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు దొంగలను గ్రామస్తుల బారి నుంచి విడిపించారు. తీవ్ర గాయాలైన వారిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే ఒకరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారు రాంపూర్ మధురకు చెందిన భోండు కృష్ణ, సదర్పూర్కు చెందిన అంకిత్ పూర్ మనోహర్, ఆశిష్గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భోండు మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను కొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!