Rajasthan: ఏటీఎంను పగలగొట్టి రూ.35 లక్షలతో జంప్.. నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని డీగ్ జిల్లా మేవాత్ ప్రాంతంలో నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరాలు, సెక్స్టార్షన్ మోసం, నకిలీ బంగారం, ఇటుక మోసం, దోపిడీ, OLXలో వాహనాల అమ్మకానికి ప్రకటనల ద్వారా మోసం వంటి కేసులు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా.. డీగ్ జిల్లాలోని గోపాల్గఢ్ పట్టణంలో సుమారు రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్ను దుండగులు ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు పప్పి అలియాస్ మక్సూద్ను అరెస్టు చేశారు.
Sai Pallavi: ఆ సీక్వెల్ కనుక సాయి పల్లవి చేసి ఉంటే.. నా సామీరంగా
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజ్ సింగ్ యోగి అనే వ్యక్తి ట్రాన్సాక్షన్ సొల్యూషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడని తెలిపారు. సెప్టెంబర్ 3న గోపాల్గఢ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్కు చెందిన రూ.34 లక్షల 76 వేల 500 ఉన్న ఏటీఎం మిషన్ను పగులగొట్టారు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. సీసీ కెమెరాలను కూడా దుండగులు ధ్వంసం చేశారని.. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతేకాకుండా MOB బృందాన్ని పిలిచి ఆధారాలు సేకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని, గోపాల్గఢ్కు అనుసంధానించబడిన అన్ని రహదారులను స్కాన్ చేశారు. సాంకేతిక మరియు మానవ మేధస్సు ఆధారంగా నిందితులను గుర్తించారు.
JP Nadda: కాంగ్రెస్ రాజ్యాంగాన్ని గౌరవించదు
ఏఎస్పీ కమ్ హిమ్మత్ సింగ్ నేతృత్వంలో డీగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ బృందాలను ఏర్పాటు చేశారు. మేవాత్ ప్రాంతంలోని కొండలు, జుర్హారా ప్రాంతం మరియు అంతర్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న హర్యానాలోని ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. గ్రామ భండారా పోలీస్ స్టేషన్ జురారాలో రూ. 34 లక్షల 76 వేల 500తో పాటు ఎటిఎంను కూల్చివేసిన నిందితుడు జహరుద్దీన్ అలియాస్ తిద్దా కుమారుడు పప్పు అలియాస్ మక్సూద్ను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో ఇంటిపైకప్పు నుండి దూకాడు. దాంతో అతని కాలికి గాయమైంది. రూ.35 లక్షలతో నింపిన ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన నిందితులను 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు.
- Tags
- arrest
- ATM
- national news
- police
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!