G20 Summit: జీ20 సమావేశాలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తామైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో పాల్గొంటున్న 15 దేశాల నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఈ భేటీలు జరగబోతున్నాయి.
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న…
US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9,…
MK Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘సనాతన’ వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రేపాయి. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమిలోని టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు నేరుగా ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించకుండా, ప్రతీ మతాన్ని గౌరవించాలని చెబుతున్నాయి.
'Bharat' controversy: ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారుస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల పేర్లు మార్చుకోవాలని ఆ దేశాలు అనుకున్నప్పుడు యూఎన్ వాటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.
PM Modi: తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.
New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు.
Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు భారత్ గా మార్పు, మహిళా రిజర్వేషన్ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.