Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- ఖార్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు చేస్తాం..
- ఇరాన్కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: ఇరాన్కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడానికి యుద్ధ నౌకల్ని పంపాలని మిత్రదేశాలను కోరారు.
అమెరికా దాడులు ఖార్గ్ ద్వీపంలోని చాలా భాగాన్ని “పూర్తిగా నాశనం చేశాయి” అని ట్రంప్ అన్నారు మరియు మరిన్ని దాడులు జరగవచ్చని, “మేము సరదా కోసం మరికొన్ని సార్లు దానిపై దాడి చేయవచ్చు” అని ప్రకటించారు. యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ, నిబంధనలు ఇంకా సరిపోవు అని ఆయన అన్నారు. ఖార్గ్ ద్వీపంపై దాడి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ప్రారంభించడానికి మిడిల్ ఈస్ట్లోని మిత్రదేవాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఖార్గ్ ద్వీపం ప్రత్యేకత:
ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖార్గ్పై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈలోని ఓడరేవులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖార్గ్ దీవి ఇరాన్ దక్షిణ తీరానికి సుమారుగా 30 కి.మీ దూరంలో ఉంది.
అయితే, ఖార్గ్ ద్వీపం అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఆయిల్ నిల్వలు, ఎక్స్పోర్ట్ టెర్మినల్స్పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయలేదు. ఈ దాడి ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించామని అమెరికా చెబుతోంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!