G20 Summit 2023: జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు.
G20 Summit: జీ20 సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షుడు బిడెన్కు ప్రైవేట్గా విందు కూడా ఏర్పాటు చేశారు.
దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అమెరికా ప్రెసిడెంట్కు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
G20 Summit: జీ20 సమావేశాలకు దేశాధినేతలు తరలివస్తున్నారు. ఒక్కొక్కరుగా దేశాధినేతలు, కీలక వ్యక్తులు న్యూఢిల్లీకి చేరుకుంటుండటంతో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీకి చేరుకున్నారు
Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని గవర్నర్ తమిళి సై అన్నారు. మా తండ్రి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని అన్నారు. నాకు గవర్నర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో భాగంలో బెల్జియంలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు ఆయన యూరప్ లో పర్యటించనున్నారు. అక్కడి పార్లమెంట్ సభ్యులను, ప్రవాసభారతీయులను, పలువురు వ్యాపారవేత్తలను ఆయన కలవనున్నారు. రాహుల్ గాంధీతో పాటు శ్యామ్ పెట్రోడా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. యూరప్ చివర్లో ఆయన నార్వేలో పర్యటించనున్నారు. ఓస్టోలో అక్కడి పార్లమెంటేరియన్ సభ్యులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధినేతలకు శనివారం విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిని ఖర్గేకు ఆహ్వానించలేదు. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అతిథులకు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.
PM Modi-Biden Meet:ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్9-10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. జీ20 సభ్యదేశాలతో పాటు మొత్తం 30 దేశాధినేతలు, పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు