PM Modi: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్” ప్రపంచ వాణిజ్యానికి కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని పురాతన కాలంలో భారత్ వాణిజ్య శక్తిగా ఉన్న సమయంలోని ‘సిల్క్ రూట్’ వాణిజ్య కారిడార్ని గుర్తు చేశారు. ఇండియానే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ని ఇటీవల జరిగిన జీ20 సదస్సులో సూచించిందని ప్రధాని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత జరిగిన జీ20 సదస్సు ప్రతీ భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన పేర్కొన్నారు.
జీ20లో ఆఫ్రికా యూనియన్ సభ్యదేశంగా చేరడంతో భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని మోడీ అన్నారు. జీ20కి వేదికైన భారత మండపం సెలబ్రెటీగా మారిందని, ప్రతీ ఒక్కరు అత్యాధునిక కాన్ఫరెన్స్ హాలులో సెల్పీలు తీసుకున్నారని ప్రధాని తెలిపారు. సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటన దినోత్సవం వస్తుందని.. టూరిజంలో కనీస పెట్టుబడితో గరిష్ట ఉపాధిని సృష్టించవచ్చని తెలిపారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..
జీ20 సమావేశాల వల్ల లక్ష మందికి పైగా విదేశీ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి భారత వైవిధ్యాన్ని, వారసత్వాన్ని చూశారని ప్రధాని వెల్లడించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో అనుబంధం ఉన్న శాంతినికేతన్, హోయసల ఆలయాలు ఇటీవల ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నిలవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. భారత్ లో 42 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, మరి కొన్నింటిని వారసత్వ ప్రదేశాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
ప్రధాని ప్రస్తావించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ పై జీ20 సమావేశాల్లో అంగీకారం కుదిరింది. దీని ద్వారా అరబ్బు, మిడిల్ ఈస్ట్ దేశాలను అటు యూరప్ తో, ఇటు భారత్ తో కలపవచ్చు. ఈ ప్రాజెక్టులో భారీ రైలు, నౌక నిర్మాణ ప్రాజెక్టులు ఉండనున్నాయి. దీని ద్వారా నేరుగా భారత్ యూరప్ దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించవచ్చు. ఇది చైనా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా, ఇండియా, ఇతర యూరప్ దేశాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!