Chada Venkat Reddy: దేశంలో ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక వ్యవస్థలు అన్ని ధ్వంసం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ చూసిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి.. అధికార పార్టీలో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన చర్యలు ఉండవు.. మహిళ బిల్లు 2007లో రాజ్యసభలో అమోదించింది.. ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కార్ లోక్ సభలో ఆమోదం తెలిపింది అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి జనగణన లేకుండానే మహిళ బిల్లు అమోదం జరిగింది.. జనగణన న్యాయబద్దంగా ఉండాలి.. ఫెడరల్ వ్యవస్థకి భిన్నంగా మోడీ సర్కార్ వ్యవహారిస్తుంది అని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Bharati Pravin Pawar : హెల్త్ కేర్ పై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించింది
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగజారి ఛీ అనే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ కమిషన్ వల్ల కష్టపడి చదివిన లక్షలాది విద్యార్థులు రోడ్డున పడ్డారు.. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చలగాటం ఆడుతుంది అని ఆయన మండిపడ్డాడు. గ్రామ సభలు పెట్టి దళితబంధు అర్హులకి ఇవ్వాలి.. బీసీ బంధు ప్రచారం తప్ప అమలు ఏది?.. అని ప్రశ్నించాడు. పార్టీ కార్యకర్తలకి కాదు, పేదరికంలో అల్లాడుతున్నావారికి ఇవ్వండి.. రైతుబంధు తీసుకున్నా వారిలో వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు అని చాడా అడిగారు.
Read Also: Skanda Event: బోయపాటి శ్రీను ‘కల్ట్ జాతర’ షురూ…
వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఎందుకు? అని చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. వందల ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు అవసరమా?.. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. ధరలకి రెక్కలు వచ్చినపుడు ఆ రేటుతో అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు ఎలా వంట చేస్తారు అని ఆయన అడిగారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో పొత్తులపై చర్చలు జరిగాయి.. రెండు మూడు రోజులలో పొత్తుల అంశం తెరపైకి వస్తది.. అసెంబ్లీలో ప్రజల గొంతుక లేదు.. చంద్రబాబు అరెస్టు కక్ష్యపూరితంగా ఉంది.. వాస్తవాలు బయటికి వస్తవి.. ధర్మం, న్యాయం గెలుస్తది.. ఈ సమస్యని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారు అని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!