Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్.. నాలుగు స్టేషన్లలో హాల్ట్
Vande Bharat: హైదరాబాద్-బెంగుళూరు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ఈరోజు ఒకే సమయంలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఈ రైలు ఏపీ మీదుగా కర్ణాటక వెళ్లనుంది. ఈ రైలు మూడు రాష్ట్రాలను కలుపుతుంది. నేడు ప్రారంభం కానున్న ఈ రైలు.. రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్పూర్ వందే భారత్కు 8 కోచ్లు ఉంటాయి. ఈ రైలులో 530 మంది ప్రయాణికులకు సీట్లు ఉన్నాయి. టికెట్ బుకింగ్ సదుపాయం ప్రారంభం.. క్యాటరింగ్ చార్జీలతో సహా ఒక్కో ప్రయాణికుడికి ఏసీ చైర్ కార్ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర రూ.2,915. మీకు క్యాటరింగ్ వద్దనుకుంటే, AC చైర్ కార్ టికెట్ రూ.1,255 మరియు ఎగ్జిక్యూటివ్ టికెట్ రూ.2,515గా నిర్ణయించబడింది.
Read also: Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి..!
Also Read
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
- Kavitha: కవిత 'TRS' పార్టీ 5 భారీ హామీలు ఇవే.. విద్య, వైద్యం ఉచితం.. 4 లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
- Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
ఈ రెండు నగరాల మధ్య దూరం 610 కి.మీ. ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్పూర్ వందే భారత్ మార్గం మధ్యలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. రైలు కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 6.49 గంటలకు మహబూబ్నగర్, 8.24 గంటలకు కర్నూలు, 10.44 గంటలకు అనంతపురం, 11.14 గంటలకు ధర్మవరం, మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ వందే భారత్ సేవలు బుధవారం మినహా వారానికి 6 రోజులు అందుబాటులో ఉంటాయి. సెలవుదినం రైలు నిర్వహణ కోసం ఉపయోగించబడుతుంది.
కాచిగూడ స్టేషన్లో జరిగే రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు ఆహ్వానాలు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ-తిరుపతి మధ్య రైళ్లు నడుస్తున్నాయి. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఐటీ సిటీలుగా పేరొందిన బెంగళూరు, హైదరాబాద్ మధ్య చాలా మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నగరాల మధ్య రైలు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. కాగా, విజయవాడ-చెన్నై మధ్య ఈరోజు మరో రైలు ప్రారంభం కానుంది. దీంతో ఏపీలో నాలుగు వందల భారత్ రైళ్లు మాత్రమే నడుస్తాయి.
Rakshit Shetty: మొదటి రోజే బ్రేక్ ఈవెన్… ఆల్ షోస్ హౌజ్ ఫుల్
తాజావార్తలు
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!