Rivaba Jadeja: “భారత ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఓదార్పు”.. కీలక వ్యాఖ్యలు చేసిన రవీంద్రా జడేజా భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా స్పందించారు.
అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం పాలైన ఆటగాళ్లను ఓదార్చడానికి మరియు మనోధైర్యాన్ని పెంచడానికి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రశంసించారు. గుజరాత్ జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. రివాబా జడేజా ఓ ట్వీట్లో.. ప్రధాని నరేంద్రమోడీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లడం అతని దయగల రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుందని అన్నారు. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
Read Also: Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
‘‘ ప్రధాని నరేంద్రమోడీ తిరుగులేని నాయకత్వం గెలుపు, ఓటమి క్షణాల్లో కూడా ప్రకాశిస్తుంది. ప్రపంచకప్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి ఆటగాళ్లను పరామర్శించడం ఆయన కరుణతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుంది, ప్రోత్సాహం, ఐక్యత స్ఫూర్తిని పెంచుతుంది’’ అంటూ మంగళవారం ఆమె ట్వీట్ చేశారు.
నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, లుబుషంగేలు ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అదించారు. భారత్ ఓటమి 140 కోట్ల ప్రజల్ని విషాదంలోకి నెట్టింది.
తాజావార్తలు
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..