Rivaba Jadeja: “భారత ఆటగాళ్లకు ప్రధాని మోడీ ఓదార్పు”.. కీలక వ్యాఖ్యలు చేసిన రవీంద్రా జడేజా భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rivaba Jadeja: భారతీయులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచకప్ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. దీంతో భారత ఆటగాళ్లే కాదు యావత్ దేశం కూడా బాధపడింది. ఇండియా ఓటమి అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ప్రతిపక్షాలు దీనిని పబ్లిసిటీ స్టంట్గా విమర్శిస్తున్నాయి, అయితే ప్రధాని డ్రెస్సింగ్ రూం సందర్శనపై క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా స్పందించారు.
అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం పాలైన ఆటగాళ్లను ఓదార్చడానికి మరియు మనోధైర్యాన్ని పెంచడానికి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ప్రశంసించారు. గుజరాత్ జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. రివాబా జడేజా ఓ ట్వీట్లో.. ప్రధాని నరేంద్రమోడీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లడం అతని దయగల రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుందని అన్నారు. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లలో ప్రధాని మోడీ మాట్లాడుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు.
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
Read Also: Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
‘‘ ప్రధాని నరేంద్రమోడీ తిరుగులేని నాయకత్వం గెలుపు, ఓటమి క్షణాల్లో కూడా ప్రకాశిస్తుంది. ప్రపంచకప్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి ఆటగాళ్లను పరామర్శించడం ఆయన కరుణతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రతిబింబిస్తుంది, ప్రోత్సాహం, ఐక్యత స్ఫూర్తిని పెంచుతుంది’’ అంటూ మంగళవారం ఆమె ట్వీట్ చేశారు.
నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, లుబుషంగేలు ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అదించారు. భారత్ ఓటమి 140 కోట్ల ప్రజల్ని విషాదంలోకి నెట్టింది.
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?