Devendra Fadnavis: అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే మెడల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారని, మొదట టీఆర్ఎస్ అని, ఇప్పుడు బీఆర్ఎస్ అని మారిందని, అయితే దీనికి బదులు ‘ఎఫ్ఆర్ఎస్’ అని ‘ఫ్యామిలీ రాజ్ సమితి’ అని పేరు పెట్టుకుంటే బాగుండేదని సెటైర్లు వేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా దళితుడిని నియమిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, రాష్ట్రంలో దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పాలన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనే హామీని విస్మరించారని ఆరోపించారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నదీ జలాలను విడుదల చేయాలని కోరారని, పక్క రాష్ట్రం తెలంగాణకు నీటిని విడుదల చేశామని, అయితే ఈ నీటిని వ్యవసాయానికి కాకుండా అవినీతికి వాడుకుంటాడని నాకు అప్పుడు తెలియదని ఆరోపించారు. బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని, కేసీఆర్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు.
‘‘కేసీఆర్ సాబ్, మహారాష్ట్ర రావాలనే కలను కనడం మానేయండి.. తెలంగాణలో బీజేపీ మిమ్మల్ని ప్యాక్ చేయబోతోంది’’ అంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలనీ, వాటిపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని, మోడీ ఎలాంటి హామీలు ఇచ్చినా.. నెరవేరుస్తారని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో పోటీ చేస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నాడని, ఇప్పటికే అలాంటి కొనుగోలు, అమ్మకాలు జరిగాయని ఫడ్నవీస్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- Devendra Fadnavis
- PM Modi
తాజావార్తలు
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!