Devendra Fadnavis: అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే మెడల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారని, మొదట టీఆర్ఎస్ అని, ఇప్పుడు బీఆర్ఎస్ అని మారిందని, అయితే దీనికి బదులు ‘ఎఫ్ఆర్ఎస్’ అని ‘ఫ్యామిలీ రాజ్ సమితి’ అని పేరు పెట్టుకుంటే బాగుండేదని సెటైర్లు వేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా దళితుడిని నియమిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, రాష్ట్రంలో దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పాలన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనే హామీని విస్మరించారని ఆరోపించారు.
Also Read
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
- OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నదీ జలాలను విడుదల చేయాలని కోరారని, పక్క రాష్ట్రం తెలంగాణకు నీటిని విడుదల చేశామని, అయితే ఈ నీటిని వ్యవసాయానికి కాకుండా అవినీతికి వాడుకుంటాడని నాకు అప్పుడు తెలియదని ఆరోపించారు. బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని, కేసీఆర్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు.
‘‘కేసీఆర్ సాబ్, మహారాష్ట్ర రావాలనే కలను కనడం మానేయండి.. తెలంగాణలో బీజేపీ మిమ్మల్ని ప్యాక్ చేయబోతోంది’’ అంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలనీ, వాటిపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని, మోడీ ఎలాంటి హామీలు ఇచ్చినా.. నెరవేరుస్తారని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో పోటీ చేస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నాడని, ఇప్పటికే అలాంటి కొనుగోలు, అమ్మకాలు జరిగాయని ఫడ్నవీస్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- Devendra Fadnavis
- PM Modi
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!