‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Panauti’ row: ప్రధాని నరేంద్రమోడీని చెడు శకునంగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్కి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలోర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. చెడుశకునం కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: YSRCP: జనసేనకు బిగ్షాక్.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ‘పనౌటీ’ అని పిలిచారు. ‘‘మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారు.. కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసింది’’ అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ నిరాశకు, మానసిక అస్థిరతకు నిదర్శనమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
తన జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేయని 55 ఏళ్ల వ్యక్తి, అతని కుటుంబం దశాబ్ధాలుగా భారత్ దేశాన్ని పరాన్న జీవులుగా మారి, అవినీతితో దోపిడి చేసిందని, వారి ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసింది. కాంగ్రెస్ మోసగాళ్లకు, భారత శత్రువులకు, టెర్రరిస్టులకు మోడీ పీడకలగా మారడమే కారణం అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘‘ అతను తన అసలు రంగు చూపించాడు, అతని తల్లి సోనియాగాంధీ అప్పటి ముఖ్యమంత్రి మోదీని ‘మౌత్ కా సౌదాగార్’ అని పిలిచిన తర్వాత గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా మునిగిపోయిందో గుర్తుంచుకోవాలి’’ అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..