భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి 'మంగల్ భవన్ అమంగల్ హరి', సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.
Ayodhya Ram Mandir: శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
Ram Mandir: అయోధ్య ‘ప్రాణప్రతిష్ట’ కార్యక్రమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రామ్ లల్లా విగ్రహాన్ని రామ మందిరానికి తీసుకువచ్చారు. క్రేన్ సాయంతో గర్భగుడి వద్దకు చేర్చారు. ఈ రోజు గర్భగుడిలో రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతుండగా.. రాముడి విగ్రహం ఆలయానికి చేరుకుంది.
ప్రధాని మోదీ కేరళ టూర్ పై కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించింది. లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ తరచూ కేరళలో పర్యటించడం వల్ల బీజేపీ అక్కడ ఖాతా తెరవబోదని కాంగ్రెస్ పేర్కొంది. కాగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మతం, ప్రార్థనా స్థలాలను రాజకీయాలతో కలపాలని చూస్తోందని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.
రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.