India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
Haryana:హర్యానాలోని సిర్సాకు చెందిన 500 మంది ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు, చౌదరి దేవీలాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్కి లేఖ రాశారు. ప్రొఫెసర్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా.. అతడిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
Maldives Row: భారత్, ద్వీప దేశం మాల్దీవ్స్ మధ్య తీవ్ర దౌత్య ఘర్షణ చెలరేగుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ సందర్శించి, అక్కడి పర్యటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవ్స్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. దీంతో అక్కడి మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక భారతీయుల దెబ్బకు ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ హాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
MakeMyTrip: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, ఆ తర్వాత మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా భారతీయలు, మాల్దీవులపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ ట్రెండ్ అవుతోంది. ఆ దేశానికి టూర్ కోసం వెళ్తామనుకున్న ఇండియన్స్ అక్కడ హోటల్స్, వెళ్లేందుకు నిర్ణయించుకున్న ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ఎగతాళి చేయడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వివాదంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ONGC Oil Production : ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్లోని డీప్ వాటర్ బ్లాక్ నుండి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు.
నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు.