Union Budget: బడ్జెట్ ప్రసంగాల్లో అతి చిన్నది ఇదే! నిర్మల ఎన్ని నిమిషాల్లో ముగించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యంతర బడ్జెట్ను దేశ ప్రజల ముందు ఉంచారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పుడూ గంటల తరబడి ప్రసంగించే సీతారామన్… ఈసారి మాత్రం గంటలోపే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.
అతి చిన్నది ఇదే..
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాల్లో ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టిన బడ్జెట్ అతి చిన్నది. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. అంటే గంటలోపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
పార్లమెంట్లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరో రికార్డ్ సృష్టించారు. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ సీతారామన్ ఖాతాలో చేరింది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42) పాటు ప్రసంగించారు. బడ్జెట ప్రసంగాల్లో అదే టాప్.
ఇక 2019-20 బడ్జెట్ను దాదాపు 137 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది రెండో అతిపెద్ద ప్రసంగం. అంతకముందు 2003-04 బడ్జెట్ను జశ్వంత్సింగ్ 135 నిమిషాల పాటు చదివారు. ఇక 2022-23 ప్రసంగాన్ని నిర్మల 86 నిమిషాల్లో ముగించేశారు. తాజాగా 2024 బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం కేవలం 57 నిమిషాల్లోనే క్లోజ్ చేశారు.
తొలి మహిళ నిర్మలనే..
మోడీ సర్కార్ 2.0 ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్నుంచీ ఆమెనే ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పని చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అదే కాకుండా 2019లో అధికారంలోకి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రెండో మహిళగా నిర్మలకే దక్కుతుంది. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె హిస్టరీ సృష్టించారు. అప్పుడామె కేవలం తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!