రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు అన్నారు మోహన్బాబు.. కులాలు అనేవి లేవు, తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారు.. కానీ, మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు.
పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులకు వారి స్వంత గౌరవం ఉంటుంది.. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు.. ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు మనం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా?.. సంప్రదాయాలను తారుమారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదు అని ఆయన పేర్కొన్నారు.
భారత్- మాల్దీవులతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల మౌనం వీడారు. ప్రతి దేశం మాకు మద్దతు ఇస్తారని నేను హామీ ఇవ్వలేను అని ఆయన తెలిపారు.
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన.
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' జాతీయ స్ఫూర్తిని పొంగల్ ప్రతిబింబిస్తోందని.. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమంలోనూ అదే భావోద్వేగ అనుబంధం కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడులోని ప్రతి ఇంట్లో పండుగ ఉత్సాహం కనిపిస్తోందని.. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ఉండాలని ఆకాంక్షించారు.
ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
Ram Mandir Inauguration: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగబోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూపీలో యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులు అతిథులుగా వెళ్తున్నారు. మొత్తం 7 వేల మంది వరకు…