మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని వెల్లడించారు. పేదలకు అండగా నిలబడి వారికి గుండె చప్పుడుగా ముఖ్యమంత్రి మారారన్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చిన అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాజకీయ నాయకుడివే కాదు కనుక రెంటుకు పార్టీ పెట్టావు పవన్.. పోటీ చేయలేడు కాబట్టే పవన్ పార్టీ అద్దెకు పెట్టాడు అని ఎంపీ విమర్శలు గుప్పించారు. బీసీలను ఎక్కిరించిన చంద్రబాబు బీసీ తీర్పుతోనే జైలు కెళ్ళాడు అంటూ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితో ఉన్న ఫోటో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోలను మంత్రి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాలుగు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి.. ధన వంతులు - పేదావాడికీ.. దొపిడీకీ - నిజాయితీ మధ్య వార్ జరుగుతోంది.. ప్రజలు చాలా గ్రహించాలి.. మళ్లీ టీడీపీ దోపిడీ పార్టీ ని రాకుండా చూడాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.