KA Paul: ఒక్క ఛాన్స్ ఇవ్వండి జగన్ గారు.. ఏపీకి పెట్టుబడులను తీసుకు వస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లా మీటింగ్ ఉత్తరాంధ్రలో జరిగింది.. కొందరు ఎన్టీ రామారావు తో లోకేషన్ పోలిస్తున్నారు.. ఇదేం పోలిక, కనీసం పెద్ద ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చండి అని ఆయన చెప్పారు. నేను సత్యం మాత్రమే మాట్లాడతాను.. చంద్రబాబుకు లోకేష్ కు 10 ప్రశ్నలు అడుగుతున్నాను.. ముఖ్యమంత్రి అయ్యేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిజమా కాదా అని ఆయన అడిగారు. ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం 50 కోట్లు అడిగారా లేదా.. టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా లోకేష్ ను చేస్తారు కాదా.. ఏపీని సింగపూర్ అని చెప్పి ఉప్పల ఆంధ్రాని చేశారు.. ఇప్పుడున్న అప్పులను ఎలా తీరుస్తారో నాతో చర్చకు రావాలి అంటూ కేఏ పాల్ సవాల్ విసిరారు.
Read Also: Bhatti Vikramarka: విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు అంటూ కేఏ పాల్ అన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారు.. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశా.. రైతులకు రుణమాఫీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి మహిళలకు ఉచిత బస్సు వైద్యం వీటన్నిటి గురించి వాగ్దానాలు చేస్తున్నారు.. లక్షా 50 వేల కోట్ల రూపాయలను ఎక్కడినుంచి తీసుకొస్తారు జవాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో తారకరత్న చనిపోయారు.. ఆయన చావుకు సంబంధించినటువంటి విషయంలో సీబీఐ విచారణకు మీరు రెడీయా అని పాల్ అడిగారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: జగన్ ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం
మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు పనులు ఎలా చేయగలడు అంటూ కేఏ పాల్ మండిపడ్డారు. జనాలు డబ్బులు ఇవ్వగానే పశువుల్లా వెళ్లారు చంద్రబాబు లోకేష్ సభకు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అసలు జగన్ ఎలా నడుపుతున్నారో అర్థం కావడం లేదు.. వేరే వాళ్లయితే సూసైడ్ చేసుకునే వాళ్ళు అని ఆయన చెప్పారు. అందరూ నన్ను కోరుకుంటారు.. పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరుతున్న నాకు సమయం ఇవ్వండి కలిసి మాట్లాడుదాం.. జగన్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పెట్టబడులు పెట్టేందుకు కోట్ల రూపాయలు తీసుకు వస్తాను అని ఆయన పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చి నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేదంటే నా పేరు మార్చుకుంటాను.. నేను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధం.. చంద్రబాబు కళ్లు నెత్తికొచ్చాయి.. లోకేష్ వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ ను చంపింది.. టీడీపీకి రియల్ వారసులైన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లకు టీడీపీని అప్పగించాలి.. మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దాని ప్రభావం లేదు.. జగన్ ఓడిపోవాలని నేను ప్రేయర్ చేయలేదు ఆయన బాగుండాలనే నేను ప్రేయర్ చేశాను అని కేఏ పాల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!