Balakrishna Comments on Pawan Kalyan goes Viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ విజయోత్సవ సభను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా సాగిన లోకేష్ పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ మేర నడిచారు. ఇక విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో యువగళం నవశకం పేరుతో పాదయాత్ర ముగింపు కోసం బహిరంగ సభను టీడీపీ భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సహా అనేక మంది తెలుగు దేశం నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రసంశలు కురిపించారు. ఈ మధ్య పవన్ సినిమాల్లో కంటే రోడ్ల మీద, సభలలోనే ఎక్కువ కనపడుతున్నాడని అన్నారు.
Pallavi Prashanth Arrested: బిగ్ బ్రేకింగ్: పల్లవి ప్రశాంత్ అరెస్ట్
నటన కేవలం సినిమాలకే పరిమితం కాదని .పవన్ కళ్యాణ్ ను సినిమాల్లో కంటే ప్రజల్లోనే ఎక్కువగా చూస్తున్నామని ఆయన కొనియాడారు. జనసేనాని ప్రజల కోసం పోరాడటం చాలా సంతోషంగా ఉందని బాలయ్య అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్న ఆయన ఇది యువగళం ముగింపు సభ కాదని నవతరం రాజకీయాలకు ఆరంభమని అని అన్నారు. తన అల్లుడు నారా లోకేష్ మీద ఈగ వాలకుండా చూసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నందమూరి బాలకృష్ణ సభకు హాజరైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక గంజాయి సాగులో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న ఆయన ఈ రాష్ట్రాన్ని సైకో పరిపాలన చేస్తున్నాడని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని పేర్కొన్న బాలయ్య ఈ సారి జగన్ ప్రభుత్వంను గద్దె దింపాల్సిందేనన్నారు. 10 లక్షల కోట్ల అప్పు.. అభివృద్ధి సున్నా .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ? ‘ అని ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు.