కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్సభలో బంపర్ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ "నారీ శక్తి వందన్ అధినియం 2023" పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కొత్త లోక్సభలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని రాహుల్ గాంధీ అభివర్ణించారు. లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బిల్లు అసంపూర్తిగా మారడానికి తన మనసులో ఒక విషయం ఉందన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ సందర్భంగా బుధవారం మహిళా ఎంపీల పేలుడు ప్రసంగాలతో కొత్త పార్లమెంట్ ప్రతిధ్వనించింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే మహిళలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ప్రభుత్వం మహిళలను లెక్కించిందని, గౌరవించిందని ప్రకటించారు.
లోక్సభలో బుధవారం జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ఇతర వెనుకబడిన కులాలు, మైనారిటీలకు చెందిన మహిళలు దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా ముఖ్యమని అన్నారు.
Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగళవారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలు ఇతర ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు.
Parliament special session: వందేళ్ల నాటి కట్టడం, భారతదేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చిరునామా నిలిచిన పార్లమెంట్, నేడు కొత్త భవనంలోకి తరలివెళ్తోంది. ఎన్నోచర్చలు, భావోద్వేగాలు, ఉగ్రవాద దాడికి కూడా ఈ బ్రిటీష్ హయాంలోని కట్టడం సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మోడీ సర్కార్ కొత్త పార్లమెంట్ని నిర్మించింది. తాజాగా ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారనుంది. ఇప్పటి నుంచి కొత్త పార్లమెంట్ దేశ భవిష్యత్తుకు కొత్త చిరునామా కానుంది.