Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Reservation Bill: కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ “నారీ శక్తి వందన్ అధినియం 2023” పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ లోక్సభలో 7గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టగా ఓటింగ్ నిర్వహించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ బిల్లు’ లోక్సభలో ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అత్యాధునిక సదుపాయాలతో గల కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్బరేలీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా 60 మంది సభ్యులు లోక్సభలో ‘నారీ శక్తి వందన్ బిల్లు’పై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై చర్చపై కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పందిస్తూ.. రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మి వంటి అసంఖ్యాక కథానాయికలను ప్రస్తావించారు.
Also Read
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ను ప్రారంభించారు. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ను నిర్వహించారు. ఆకుపచ్చ, ఎరుపు స్లిప్పులపై ఎస్, నో అని ఉంటాయని వాటిపై సంతకం చేసి వారీ పేరు, ఐడీ నంబర్ సహా నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరు రాయాలని లోక్సభ సెక్రటరీ సూచించారు. స్లిప్పులు పంపిణీ అనంతరం మళ్లీ వాటిని తీసుకునే వరకు ఎవరూ సీట్ల నుంచి వెళ్లవద్దని సూచించారు. ఈ విధంగా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్లో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించింది.
Also Read: Amit Shah: 2024లో మహిళా బిల్లు లేదు.. లోక్సభలో స్పష్టం చేసిన అమిత్ షా
మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు కోటాకు 33 హామీని ఇస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ అనేది బీజేపీతో సహా అనేక పార్టీల వాగ్ధానం.
తాజావార్తలు
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..