Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
Women Reservation Bill: కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ “నారీ శక్తి వందన్ అధినియం 2023” పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ లోక్సభలో 7గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టగా ఓటింగ్ నిర్వహించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ బిల్లు’ లోక్సభలో ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అత్యాధునిక సదుపాయాలతో గల కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై స్లిప్ ద్వారా ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాయ్బరేలీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా 60 మంది సభ్యులు లోక్సభలో ‘నారీ శక్తి వందన్ బిల్లు’పై చర్చలో పాల్గొన్నారు. బిల్లుపై చర్చపై కేంద్ర మంత్రి మేఘ్వాల్ స్పందిస్తూ.. రాణి దుర్గావతి, రాణి చెన్నమ్మ, రాణి అహల్యాబాయి, రాణి లక్ష్మి వంటి అసంఖ్యాక కథానాయికలను ప్రస్తావించారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ను ప్రారంభించారు. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ను నిర్వహించారు. ఆకుపచ్చ, ఎరుపు స్లిప్పులపై ఎస్, నో అని ఉంటాయని వాటిపై సంతకం చేసి వారీ పేరు, ఐడీ నంబర్ సహా నియోజకవర్గం, రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పేరు రాయాలని లోక్సభ సెక్రటరీ సూచించారు. స్లిప్పులు పంపిణీ అనంతరం మళ్లీ వాటిని తీసుకునే వరకు ఎవరూ సీట్ల నుంచి వెళ్లవద్దని సూచించారు. ఈ విధంగా ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటింగ్లో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించింది.
Also Read: Amit Shah: 2024లో మహిళా బిల్లు లేదు.. లోక్సభలో స్పష్టం చేసిన అమిత్ షా
మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో సభ తొలి సమావేశం సందర్భంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు కోటాకు 33 హామీని ఇస్తుంది. పార్లమెంట్, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ అనేది బీజేపీతో సహా అనేక పార్టీల వాగ్ధానం.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!