Women’s Reservation Bill: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం హర్షణీయం : గోదావరి అంజిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కేటాయింపు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం, లోక్ సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. భారత దేశ మహిళల తరుపున, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
Read Also:GVL Narasimha Rao: అప్పటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమలులోకి..!
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
అదేవిధంగా కచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది మాత్రం బీజేపీనే అన్నారు. త్వరలో బిల్లు అమలు చేసేది బీజేపీ ప్రభుత్వమే అని.. గత పది సంవత్సరాలుగా బీజేపీ కమిటీల్లో నూ 33శాతం రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది. 12 మందిని కేంద్ర మంత్రులుగా, 8 మందిని గవర్నర్లుగా, నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం బీజేపీ అన్నారు. దేశ చరిత్ర లో తొలిసారి పార మిలటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు నిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారే అన్నారు. కేవలం మహిళల ఓట్ల కోసం ఎజెండా పెట్టే ఇండియా కూటమి నిజంగా మహిళలకు సమన్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోయే బిల్లుకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూపాల్ రెడ్డి రామచంద్రపురం జిల్లా కార్యదర్శిసరస్వతి యాదిరెడ్డి రాంబాబు, మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ జ్ఞానేశ్వరి, సరళ, రాణి తదితరులు పాల్గొన్నారు.
Read Also:Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..