Home
Pakistan News
Pakistan News News
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
Operation Sindoor: 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టడం ఎవరూ మరిచిపోలేదు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2025 మే 10వ తేదీ ఉదయం, ఆపరేషన్ సిందూర్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోరుతూ పాకిస్థాన్ డీజీఎంఓ హాట్లైన్ ద్వారా భారత్ను సంప్రదించింది. అయితే, పాకిస్తాన్పై భారత్ చేయాల్సిన దాడులు సగం మిగిలి ఉండటంతో… -
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
POK Protests: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న వేళ, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై ఆరోపణలు చేశారు. రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన 276వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన కాశ్మీర్ను పాకిస్తాన్కు అత్యంత కీలకమైన అంశంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా జమ్మూ-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, జనాభా మార్పులకు భారత్ పాల్పడుతోందని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది. పాకిస్తాన్ సైన్యం… -
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది”… -
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
China-Pakistan: చైనా మరోసారి పాకిస్తాన్తో ఉన్న స్నేహం గురించి గొప్పగా మాట్లాడింది. పాకిస్తాన్ ప్రధాని షెహజాబ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లు చైనాలో పర్యటిస్తున్నారు. షరీఫ్తో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ సమావేశమయ్యారు. పాకిస్తాన్-చైనా బంధాన్ని ‘‘అన్ని కాలాలకు అనువైన వ్యూహాత్మక భాగస్వామ్యం’’గా జిన్ పింగ్ అభివర్ణించారు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారినా పాకిస్తాన్తో సంబంధాలకు చైనా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బీజింగ్లోని గ్రేట్ హాట్ ఆఫ్ ది పీపుల్లో ఇరు దేశాధినేతల సమావేశం… -
Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
Pakistan: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది. బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 23 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో రైలు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాల వెండి… -
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
Unknown Gunmen: పుల్వామా ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్లో కాల్చి చంపారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్(పీఓకే)లోని ఇతడి మృతదేహం లభ్యమైంది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా అటాక్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్లోని జైషే మహ్మద్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్లో ఉగ్రవాదులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు… -
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
Pulwama Attack: పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచలనం క్రియేట్ చేశారు. పుల్వామా సూత్రధారి, పాకిస్తాన్కు చెందిన మోస్ట్ వాంటెంట్ ఉగ్రవాది హమ్జాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో బుర్హాన్ హమ్జా మృతదేహం లభ్యమైంది.హమ్జా పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తు్న్నారు. ఉగ్రవాది హమ్జాను కూడా ఇలాగే చంపారు. డాక్టర్గా పిలిచే హమ్జా బుర్హాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అనేక సార్లు… -
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గతంలో చేసిన విదేశీ కుట్ర ఆరోపణలు మరోసారి తీవ్ర సంచలనంగా మారాయి. ఆయనను అధికారంలో నుంచి దించేయడం వెనుక అమెరికా హస్తం ఉందంటూ అప్పట్లో రేగిన దుమారానికి బలం చేకూర్చేలా, ఒక అత్యంత రహస్య దౌత్య కేబుల్ (టాప్-సీక్రెట్ డిప్లొమాటిక్ కేబుల్) సమాచారం ఇప్పుడు బయటకు పొక్కింది. ‘డ్రాప్ సైట్’ (Drop Site) అనే పరిశోధనాత్మక వార్తా సంస్థ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ను బహిర్గతం చేయడంతో పాక్ రాజకీయాల్లో… -
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
Pakistan: పాకిస్తాన్లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్ చేశారు. ఉగ్రవాద నాయకుడిపై మరోసారి టార్గెటెడ్ అటాక్ జరిగింది. ఆ దేశంలోని బలూచిస్తాన్ ప్రావిన్సులో అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థ సీనియర్ కమాండర్ మీర్ శుక్ర ఖాన్ రైసాని హతమయ్యాడు. ఇటీవల కాలంలో లష్కరేకు చెందిన పెద్ద తలకాయలను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తు్న్నారు. ఏ ప్రావిన్సులో ఉన్నా కూడా వెతికి మరి చంపుతున్నారు. తాజాగా జరిగిన సంఘటన బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగింది. ఒక… -
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
Islamabad in Lockdown: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ గత 10 రోజులుగా అప్రకటిత లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల అవకాశాలు, ఉన్నతస్థాయి విదేశీ ప్రతినిధుల పర్యటనల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అయితే, ఈ ఆంక్షలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లామాబాద్లో ప్రధాన రహదారులను మూసివేయడంతో పాటు మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు కూడా మూతపడ్డాయి. నగరమంతా సైన్యం, పోలీసులు మోహరించడంతో ప్రజా రవాణా కూడా దాదాపు…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..