Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్ప్రెస్పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
- పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి..
- జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా బీఎల్ఏ అటాక్..
- 23 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది. బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 23 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో రైలు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాల వెండి ఉన్న అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
చమన్ గేట్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగింది. మరణించిన వారిలో పాక్ ఆర్మీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
- Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
గతంలో కూడా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా బలూచ్ వీరులు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఈ రైలునే హైజాక్ చేసి, పాక్ ఆర్మీ అధికారుల్ని ఊచకోత కోశారు. క్వెట్టా నుంచి పెషావర్ ప్రయాణించే ఈ రైలులో చాలా మంది ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తుంటారు. దీంతో చాలా సార్లు బీఎల్ఏ ఈ రైలును టార్గెట్ చేస్తోంది. తాజాగా జరిగిన సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్లో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?