Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- ఆపరేషన్ సిందూర్ గురించి మరో కొత్త విషయం వెలుగులోకి..
- పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరినా, దాడులు కొనసాగించినా భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టడం ఎవరూ మరిచిపోలేదు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. 2025 మే 10వ తేదీ ఉదయం, ఆపరేషన్ సిందూర్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోరుతూ పాకిస్థాన్ డీజీఎంఓ హాట్లైన్ ద్వారా భారత్ను సంప్రదించింది. అయితే, పాకిస్తాన్పై భారత్ చేయాల్సిన దాడులు సగం మిగిలి ఉండటంతో పాక్ అభ్యర్థనను భారత్ వెంటనే ఒప్పుకోలేదని తెలిసింది. ఈ విషయాన్ని టైర్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు.
భారత్ మరింత తీవ్రంగా దాడులు చేస్తుందనే భయంతో పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందని చౌహాన్ వెల్లడించారు. వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించకుండా మధ్యాహ్నం వరకు సైనిక చర్య కొనసాగించినట్లు చెప్పారు. ఈ వ్యవధిలో పాకిస్తాన్కు చెందిన మొత్తం 11 సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించిందని వెల్లడించారు. ఈ దాడుల్లో పాక్కు కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. ఈ దాడుల ద్వారా పాకిస్తాన్ లోని ఏ సైనిక స్థావరమైన భారత పరిధిలో ఉందనే స్పష్టమైన సంకేతం ఇచ్చామని అనిల్ చౌహాన్ అన్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్తో సహా, రహీమ్ యార్ ఖాన్, భోలారి వంటి స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను ఇప్పటికీ పాకిస్తాన్ మరమ్మతులు చేయించుకుంటోంది.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
మే 9వ తేదీ రాత్రి నుండి మే 10వ తేదీ మధ్యాహ్నం వరకు భారత్ దాడులు చేసిన 8 గంటల్లోపే పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపారు. ఘర్షణలు కొనసాగితే తాము ఘోరంగా ఓడిపోతామని పాకిస్తాన్కు తెలుసని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రతిదాడుల్ని భారత సైన్యం వేగంగా అంచనా వేయగలిగిందని, అదే నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడ్డాయని, యుద్ధభూమిలో స్పష్టమైన సమాచారంతో భారత్ వ్యూహాతర్మ ఆధిక్యం సాధించిందని చెప్పారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!