వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు..…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి…
దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. అలా చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని కవిత పేర్కొన్నారు. ధాన్యం…
తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్…
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు..…
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట…
ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొన లేదు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుపాలంటూ టీఆర్ ఎస నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణ బీజేపీ నేతలేమో కేంద్రం ధాన్యం కొంటామన్నా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ లో ఏవిధంగానైతే ధాన్యం కొంటున్నారో.. అదే విధంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో మేము ప్రజలము కాదా?…
ధాన్యం కోనుగోళ్ల విషయమై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరింది. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మానసిక…
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ ప్రజలను అవమనపరిచేలా ఇవాళ మాట్లాడారని మంత్రి హరీష్రావు తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ కు వక్రీకరణలు అలవాటుగా మారిందని, పీయూష్ గోయల్ కు అర్థం కావడం లేదు…వ్యవసాయం చేస్తే రైతు సమస్యలు ఏమిటో ఆయనకు తెలిసేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని, తెలంగాణ రైతుల సమస్యను పీయూష్ గోయల్ అర్థం కావడం…