Home
Paddy Procurement
Paddy Procurement News
-
Madhu Yaskhi: ఢిల్లీలో కేసీఆర్.. హైదరాబాద్లో బీజేపీ దీక్ష.. దొంగడ్రామాలు..!
తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటానికి తీసుకెళ్లింది టీఆర్ఎస్ పార్టీ.. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ దీక్ష చేయబోతున్నారు.. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్షకు సిద్ధమయ్యారు.. ఇదే సమయంలో.. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ రైతు దీక్ష చేస్తోంది.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.. అయితే, బీజేపీ, టీఆర్ఎస్… -
TRS Protest: గల్లీలో ముగిసింది.. ఇక ఢిల్లీలో పోరు.. కేసీఆర్ రైతు దీక్ష
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో.. వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధం అయ్యింది.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టబోతున్నారు.. కేంద్రం ధాన్యం కొనాలంటూ ఢిల్లీలో నిరసన దీక్షకు దిగుతోంది టీఆర్ఎస్ పార్టీ… ధాన్యం సేకరణ కోసం దేశ వ్యాప్తంగా… -
TS Paddy Procurement : బీజేపీ, టీఆర్ఎస్ల నూ’కల’ రాజకీయం
తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర… -
K Keshava Rao : మా మీద మీద కత్తి పెట్టి అగ్రిమెంట్ చేశారు
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుకు దిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కేశవరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని, తెలంగాణలో వచ్చే రబి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఆయన డిమాండ్… -
Nama Nageswara Rao : అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష్య కట్టిందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకు వెళ్లామని ఆయన అన్నారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు, రైతుల ధాన్యం కొనడానికి అడ్డంకులు.. అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన తెలిపారని… -
Vijayashanthi : అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చే
బీజేపీ పార్టీనీ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు విజయశాంతి… నిజామాబాద్ జిల్లా భోధన్ లో జరిగిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ మీద కోపంతో, బీజేపీ పార్టీపై భయంతో రైతులను కేంద్రంపైకి కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. రైతులు సంయమనంతో ఆలోచించాలని… బీజేపీ ద్వారా మాత్రమే రైతులకు మేలు, న్యాయం జరుగుతుందిని విజయశాంతి అన్నారు. వరి… -
Bandi Sanjay : రండి కదలండి అంటూ.. రైతులకు బహిరంగ లేఖ..
టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతోందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కయ్యారని, భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ అని, రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్, అన్నదాతాలారా…. కేసీఆర్ కుట్రలను చేదిధ్దాం రండి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక… -
Etela Rajender : శిశుపాలుడిలాగ టీఆర్ఎస్ వంద తప్పులు చేసింది
మహబూబ్ నగర్ జిల్లాలో కిసాన్ మోర్చా నిర్వహించిన రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసింది. ప్రజలు టీఆర్ఎస్ను శిక్షించి నన్ను గెలిపించారని, 101వ తప్పుకు కూడా ప్రజలు శిక్షిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమేనని, ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా… -
Madhu Yashki: బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు..
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు..… -
Vemula Prashanth Reddy : పీయూష్ గోయల్ సర్పంచ్గా కూడా పనికిరాడు
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది…
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!