Telangana: వైఎస్ షర్మిల ఫైర్.. కేసీఆర్కు సీఎం పదవి అవసరమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.
Read Also: AAP: ఆమ్ఆద్మీలో కొత్త జోష్.. ఆ పార్టీ గూటికి కీలక నేత..
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
ఏ ప్రభుత్వంలో నైనా నేను చెప్పిన పంట వేయాలి అనే హక్కు పాలకులకు ఎక్కడైనా ఉందా…? అంటూ నిలదీశారు వైఎస్ షర్మిల… మద్దతు ధర ఉన్న పంట పండించకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పని చేసి బతకాలి..? అని ప్రశ్నించిన ఆమె.. పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల్ని హింసిస్తున్న కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి అవసరమా…? అంటూ మండిపడ్డారు. ఆనాడు కులమత బేధాలు పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్న ఆమె.. ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పోడు భూములకు గిరిజనులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని గుర్తుచేశారు.. ఇప్పుడు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా గిరిజన మహిళలు, చంటిపిల్ల తల్లులపై కేసులు బనాయించి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని.. రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చా నన్ను ఆశీర్వదించండి మళ్లీ రైతు రాజ్యాన్ని తీసుకవస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!