Paddy Procurement: కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ఎర్రబెల్లి.. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో వరి పంట పెరిగిందని గుర్తు చేశారు. ఇక, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు మంత్రి ఎర్రబెల్లి.
Read Also: CBI: అవినీతి కేసు.. సీబీఐ కస్టడీకి మాజీ హోంమంత్రి..
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
వరి ధాన్యాన్ని కొంటామని బండి సంజయ్ చెప్పారు… రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు వివక్షత చూపుతోందని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి.. కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు వదిలేదిలేదని హెచ్చరించారు.. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు రాజ్యసభలో వ్యతిరేకించామని.. అందువల్లనే తెలంగాణ రైతాంగాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి.. రైతులంతా ఏకం కావాలి.. జిల్లా వ్యాప్తంగా రేపు ధర్నాలు చేపడుతున్నామని పిలుపునిచ్చారు.. ఇక, 8వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటిపై నల్ల జెండా ఎగరేసి చావు డప్పు, బీజేపీ శవయాత్ర చేపట్టాలన్నారు. 11వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయన్న ఆయన.. ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు.. ఇక, విభజన చట్టంపై కూడా కేంద్రం మాటనిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!