Paddy Procurement: కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ఎర్రబెల్లి.. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో వరి పంట పెరిగిందని గుర్తు చేశారు. ఇక, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు మంత్రి ఎర్రబెల్లి.
Read Also: CBI: అవినీతి కేసు.. సీబీఐ కస్టడీకి మాజీ హోంమంత్రి..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
వరి ధాన్యాన్ని కొంటామని బండి సంజయ్ చెప్పారు… రా రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు వివక్షత చూపుతోందని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి.. కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు వదిలేదిలేదని హెచ్చరించారు.. కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు రాజ్యసభలో వ్యతిరేకించామని.. అందువల్లనే తెలంగాణ రైతాంగాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి.. రైతులంతా ఏకం కావాలి.. జిల్లా వ్యాప్తంగా రేపు ధర్నాలు చేపడుతున్నామని పిలుపునిచ్చారు.. ఇక, 8వ తేదీన ప్రతి గ్రామంలో ఇంటింటిపై నల్ల జెండా ఎగరేసి చావు డప్పు, బీజేపీ శవయాత్ర చేపట్టాలన్నారు. 11వ తేదీన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయన్న ఆయన.. ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సూచించారు.. ఇక, విభజన చట్టంపై కూడా కేంద్రం మాటనిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తాజావార్తలు
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!