Madhu Yashki: బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు.. ఈ నెల 11వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాలు తెరవాలని డెడ్లైన్ పెట్టిన యాష్కీ.. అధికార పార్టీలు సమస్య పరిష్కారం చేయాలి.. ఆందోళనలు కాదు అని హితవుపలికారు.
12వ తేదీన నియోజక వర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు మధుయాష్కీ గౌడ్.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతున్నాం.. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అవుతుంది అని ఫిర్యాదు చేస్తామని.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు.. ఇక, ఏప్రిల్ 15 తర్వాత ఐదు బృందాలుగా ఏర్పడి కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్నట్టు వెల్లడించిన ఆయన.. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న మిల్లర్ల పై విజిలెన్స్ దాడులు.. కేసులు పెట్టాలి డిమాండ్ చేస్తామన్నారు.. ఏప్రిల్ 14న సంజయ్ పాదయాత్రకు హేమంత్ బిస్వల్ వస్తున్నారు.. ఆయన మీద కేసు ఉంది… ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారు.. కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.. దీనిపై డీజీపీని కలుస్తామన్నారు మధుయాష్కీ.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!