కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా ? కేబినెట్ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా…లోలోపల నేతలు భయపడుతున్నారా ? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా ? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు…కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా ? తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు దెబ్బతినడం…సుందిళ్ల బ్యారేజీలో సీపేజ్ సమస్యలు రావడాన్ని…
MLAల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం…స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..? నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఆ ఎన్నికలు కూడా వస్తాయా..? ప్రతిపక్షం ఆశలు నెరవేరుతాయా..? ఒకరు కాదు… ఇద్దరి పైనా వేటు పడుతుందా..? అనర్హత వేటు నుండి బయటపడాలి అంటే… ఆధారాలు పక్కా ఉండాలి. ఇప్పుడా ఆధారాలు… ఆ ఇద్దరి విషయంలో ఉన్నాయా..? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్…
ఓపెన్ విత్ కేటీఆర్ బైట్ చారి గురించి చెప్పింది చిన్నగా ఈ మాటలే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఈ మాటలే ఇప్పుడు భూపాలపల్లి కారులో తీవ్ర దుమారం రేపుతున్నాయట.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే... రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే... ఓవరాల్గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే... టైం గడిచేకొద్దీ.... ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
పులి మీదొట్టు… పచ్చి రాజకీయం చేసేస్తాం. రాజీనామా డ్రామాలాడేస్తామని అక్కడి రాజకీయ నేతలంతా అంటున్నారా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఆ ఎపిసోడ్లో అందరి ప్రమేయం ఉన్నా… ఎవరికి వారు తూచ్… మాకు సంబంధం లేదంటూ పక్క పార్టీ మీదికి నెట్టేస్తున్నారా? ఏంటా ఎపిసోడ్? ఎందుకు ఆ స్థాయి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి? కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్….. పులుల సంరక్షణ కోసం ఈ పేరిట మొన్న మే 30న తెలంగాణ అటవీ శాఖ జీవో…