Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Twist In Tdp Mps Meeting With Union Steel Minister

Off The Record: ఎంపీల మీటింగ్లో ట్విస్టులు ఉన్నాయా..?

Published Date :August 12, 2025 , 9:40 pm
By Chandra Shekhar Pamena
  • కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ..
  • స్టీల్‌ ప్లాంట్‌ గురించి చర్చించామని ప్రకటన..
  • ఎంపీల మీటింగ్‌లో ట్విస్ట్‌లు ఉన్నాయా?..
  • వినతి పత్రం ఇచ్చింది విశాఖ ఉక్కు కోసం కాదా?..
  • హిడెన్‌ అజెండా ఉందంటూ మాజీ ఐఎఎస్‌ శర్మ లేఖ..
  • క్యాప్టివ్‌ మైన్స్‌ కోసం ఏళ్ళుగా విశాఖ ఉక్కు ఎదురుచూపులు..
  • ఉత్పత్తి పెంపు, ఆర్థిక భారం తగ్గించుకోవడంపై దృష్టి..
  • కేంద్ర మంత్రిని కలవడం మంచిదే అనుకుంటున్న టైంలో ట్విస్ట్‌..
  • పాయకరావుపేట నియోజకవర్గంలో మిట్టల్‌ భారీ ప్లాంట్‌..
  • పెట్టబోయే మిట్టల్‌ స్టీల్స్‌కు క్యాప్టివ్‌ మైన్స్‌ కోసమే భేటీ అన్న ప్రచారం
Off The Record: ఎంపీల మీటింగ్లో ట్విస్టులు ఉన్నాయా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ కేంద్ర మంత్రిని కలవడం మీద మెల్లిగా రచ్చ మొదలవుతోందా? ఎవరికో సాగిలపడటానికే, ఎవరో బడా పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికే వాళ్ళ కట్టగట్టుకుని కేంద్ర మంత్రిని కలిశారన్న ప్రచారంలో నిజమెంత? ఏంటా మిలాఖత్‌, అండ్‌ ములాఖత్‌ పాలిటిక్స్‌? ఎంపీలు కేంద్ర మంత్రిని కలిస్తే రచ్చ అవ్వాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి?

Read Also: Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

మొదటి దానికి మొగుడు లేడుగానీ.. కడదానికి కల్యాణం అంట అన్నది సామెత. ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీలు కూడా ఇదే వరసలో ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతికి కేంద్రం చేయూత లాంటి అంశాలను ఆయనతో చర్చించామని, కేంద్రం సానుకూలంగా ఉందని బయటికి వచ్చాక ఘనంగా ప్రకటించుకున్నారు. ఏం, బాగానే ఉంది కదా?.. అందులో ఆక్షేపించాల్సింది ఏముంది? మరీ.. రంధ్రాన్వేషణ చేయడం కాకపోతేనూ.. అంటారా? ఆగండాగండి. అక్కడే ఉందట అసలు ట్విస్ట్. ప్రతిపక్షానికి అది బ్రహ్మాస్త్రం కాబోతోందని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ మేటర్‌ ఏంటంటే.. టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రిని కలవడం, వినతి పత్రం ఇవ్వడం కరెక్టే. కానీ.. ఆ పత్రం దేనికి సంబంధించినదన్న దగ్గరే అనుమానాలు వస్తున్నాయట. ఈ భేటీ వెనక హిడెన్‌ అజెండా ఉందంటూ… రిటైర్డ్‌ ఐఎఎస్ అధికారి EAS శర్మ బాంబ్ పేల్చడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ కొత్త చర్చకు కారణం అయింది. దీంతో కొందరు ఎంపీలు మాత్రమే హాజరైన సమావేశంలో అసలు ఏం జరిగి ఉంటుందన్న ఆరాలు పెరిగిపోతున్నాయి.

Read Also: YS Jagan: జడ్పీటీసీ ఉప ఎన్నికలు రద్దు చేయాలి.. మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్వీట్..

అయితే, ఎంపీలు స్టీల్‌ ప్లాంట్‌ కోసం విన్నపాలు చేసింది నిజమేగానీ.. అది వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ కోసం కాదన్న సమాచారం విశాఖలో పొలిటికల్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమ్మనీ.. వీళ్ళంతా కేంద్ర ఉక్కు మంత్రిని మీటైంది ఇందుకా అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారట ఇంకొందరు. విశాఖ ఉక్కు అన్నది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు. అది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్న కర్మాగారం. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 26వేల ఎకరాల భూములు, 30వేల మంది కార్మికులు, ఉద్యోగులతో కళకళలాడిన పరిశ్రమ. ఇప్పుడా వైభవం దశలవారీగా కనుమరుగవుతోంది. శాశ్వత గనులు లేని కారణంగా వచ్చిన లాభాలన్నీ రా మెటీరియల్ కొనుగోళ్ళకే సరిపోతుండటం కారణంగా నష్టాలు మొదలయ్యాయి. దీన్ని సాకుగా చూపి ప్రయివేటీకరణ కత్తి ఝుళిపించింది కేంద్రం.

Read Also: CM Revath Reddy : వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు

నాలుగేళ్ళకుపైగా కార్మిక పోరాటం, రాజకీయ పక్షాల ఆందోళనలతో ప్రైవేటీకరణ వాయిదా పడుతూ వస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ అజెండాతో వెళ్ళింది కూటమి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాలు ఫలించి కేంద్రం వెనక్కి తగ్గింది. స్వయంగా ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి రెండు పర్యాయాలు ప్లాంట్ విజిట్ చేయడంతో పాటు భారీగా నిధులు విడుదల చేసేందుకు సహకరించారు. మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించడం ద్వారా 100శాతం ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తోంది విశాఖ ఉక్కు. అదే సమయంలో ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, సీనియర్లను వీఆర్ఎస్‌ పేరుతో ఇళ్ళకు పంపించడంలాంటివి ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నాయి. కానీ, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. విశాఖ స్టీల్ ప్లాంట్ శాశ్వతంగా నిలబడాలంటే సొంత గనులు కావాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం కీలకమని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సెయిల్‌లో మెర్జర్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికానందుక ‘క్యాప్టివ్ మైన్స్’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేథావులు, ప్రజాసంఘాలు పోరు పెడుతున్నాయి.

Read Also: Justice : పార్కింగ్‌ కోసం 17 ఏళ్లు… చివరికి న్యాయం ఇలా..!

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ గురించి చర్చించారని తెలియడంతో.. పాజిటివ్ వైబ్ వస్తుందని భావించారు అంతా. కానీ, లోగుట్టు వేరే ఉందన్న ప్రచారంతో అంతా అవాక్కవుతున్నారట. హన్నన్న, ఇంత జరిగిందా?.. అని నోరెళ్ళబెట్టేస్తున్నారట. ప్రస్తుతం కార్మిక వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం చూస్తే.. టీడీపీ ఎంపీలు కుమారస్వామిని కలిసింది మునిగిపోతున్న విశాఖ ఉక్కు కోసం కాదట. త్వరలో అనకాపల్లి జిల్లాలో మిట్టల్ గ్రూప్ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కోసమన్నది వాళ్ళ డౌట్‌. పాయకరావు పేట నియోజకవర్గ పరిధిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఫేజ్ 1 కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ పెట్టుబడులను ఆకర్షించే పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి సహకరిస్తోంది. కొత్తగా పెట్టబోయేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కావడంతో పారిశ్రామిక అభివృద్ధి గేరప్ అవుతుందనేది యదార్ధం. అయితే, టీడీపీ ఎంపీలు ప్రభుత్వ సంస్థను కాదని, ఇటీవల జరిగిన మీటింగ్‌లో మిట్టల్ స్టీల్స్‌కు అవసరమైన క్యాప్టివ్‌ మైన్స్‌, ఐరన్ ఓర్ స్లర్రీ పైప్ లైన్ నిర్మాణం కోసం సహకరించమని కేంద్రాన్ని కోరారన్న ప్రచారం కలకలం రేపుతోంది.

Read Also: Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌ ఏడాదిన్నరగా అతీగతీ లేని భర్తీ

ప్రభుత్వ రంగంలో వున్న విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ లేక కునారిల్లిపోతుంటే ఎంపీలకు చీమకుట్టినట్టైనా లేదని.. అదే, ప్రైవేట్ సంస్ధల కోసం సాగిలపడి మరీ లాబీయింగ్ చేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రయివేట్ ప్రయత్నాలను పక్కన బెట్టి విశాఖ ఉక్కు పరిరక్షణకు నిలబడకపోతే నిలదీస్తామని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద కుమారస్వామికి తెలుగుదేశం ఎంపీలు ఇచ్చిన లేఖేంటో.. చెవిలో చెప్పిందేంటో.. కచ్చితంగా తెలియదుగానీ.. అదంతా మిట్టల్ స్టీల్ కోసం మంత్రాంగం అనేది మాత్రం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది. దీంతో అనుమానాలను నివృత్తి చేయడానికైన టీడీపీ ఎంపీలు బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది. వాళ్ళు గనక అలాగే సైలెంట్‌గా ఉంటే.. మిట్టల్‌ కోసమే ఎంపీలు పనిచేస్తున్నారన్న ప్రచారం జనంలోకి విపరీతంగా వెళ్లిపోయి అంతిమంగా తెలుగుదేశం పార్టీకే నష్టంం కలగవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికార పార్టీ లోక్‌సభ సభ్యుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record
  • OTR
  • tdp
  • tdp mps

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions