ఏపీలో రోడ్లు, ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని…
వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం: దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో…
నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్న మంత్రి నారా లోకేశ్ నేడు రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన.. పలు కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు, రేపు వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను విచారించనున్న నగరంపాలెం పోలీసులు.. ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు…
పొలిటికల్ స్క్రీన్ మీద అన్నదమ్ముల సవాల్లో కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? ఎన్నికల్లో ఓడిపోయి పదినెలలు కామ్గా ఉన్న అన్న ఇప్పుడెందుకు తమ్ముడు టార్గెట్గా సోషల్ వార్ మొదలుపెట్టారు? ఉన్నట్టుండి ఈ మార్పునకు కారణం ఏంటి? అన్న కమ్ మాజీ ఎంపీ… ఇప్పుడు తమ్ముడు కమ్ సిట్టింగ్ ఎంపీ మీదికి కొత్త అస్త్రాల్ని సంధించబోతున్నారా? ఎవరా పొలిటికల్ వారియర్ బ్రోస్? ఏమా ఫ్యామిలీ డ్రామా? కేశినేని నాని…బెజవాడ నుంచి టిడిపి తరఫున రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన నాయకుడు.…
కేసులు బుక్ అవగానే గప్చుప్మని దేశం దాటేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చి నియోజకవర్గంలో వాలిపోయారు? పైగా వేధింపులు, సాధింపులు అంటూ సెంటిమెంట్ పండించి పొలిటికల్ ఆయింట్మెంట్ రాయడం వెనకున్న వ్యూహం ఏంటి? నాడు వణికించిన కేసుల భయం ఇప్పుడెందుకు పోయింది? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన ఔట్ గోయింగ్ అండ్ ఇన్ కమింగ్ స్టోరీ? నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు.. నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా…
కాషాయదళం తెలంగాణలో దూకుడు పెంచాలనుకుంటోందా? అందుకు స్పెషల్ ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ముంది కింది నుంచి రావాలని పార్టీ ముఖ్యులు ఫిక్స్ అయ్యారా? అందుకు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ కొత్త ప్లాన్ ఏంటి? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో జరగవచ్చన్నది కమలనాధుల అంచనా అట. అందుకే ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలు బలపడాలంటే… బీజేపీ గెలవాలన్న నినాదంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. గ్రామాలకు కేంద్ర…
అక్కడ కూటమిలోని బాబాయ్, అబ్బాయ్ ఓ అండర్స్టాండింగ్తో పంచేసుకుంటున్నారా? నీకది, నాకిది అంటూ… వాటాలేసుకునమి మరీ ఎవరికి వాళ్ళు వసూళ్ళ పర్వంలో మునిగి తేలుతున్నారా? కాకుంటే… వాటికి కాంట్రాక్ట్లు అంటూ ముద్దు పేరు పెట్టుకుని మరీ లాగించేస్తున్నారా? ఎంత కొమ్ములు తిరిగిన కంపెనీ అయినాసరే…. వాళ్ళని కాదని అడుగు ముందుకేసే పరిస్థితి లేదా? ఎవరా బాబాయ్, అబ్బాయ్? ఏంటా బెదిరింపుల పర్వం? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ. ఇప్పుడు భారీ పరిశ్రమలకు అడ్డా. సాధారణంగా…
వాళ్ళు చర్చిస్తారు… నిర్ణయిస్తారు.. నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. బస్… అక్కడితో మేటర్ ఖతం. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉండదా? లేదా మనం మీటింగ్లు పెట్టి బిస్కెట్ తిని ఛాయ్తాగి వెళ్ళిపోతే… నిర్ణయాలు వాటంతట అవే అమలైపోతాయని ఫీలవుతారా? ఏకంగా పార్టీ చెప్పిన మాటకు కూడా దిక్కులేదా? ఇక్కడ ఓన్లీ టెలింగ్స్..!? నో ఇంప్లిమెంటేషన్సా? అంతా… తలపండిన నేతలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. వ్యూహరచనలు, ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కూడా అందరూ…
వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగానీ… దీనికేం చేయాలో అర్ధంకావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్లోనే చిటపటలాడి పోతున్నారా..? ఎందుకా టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉమ్మడి విశాఖజిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్ధ, వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా… అసంత్రుప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళంతా సీనియర్సే కావడంతో..…
మూడు ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత: తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు ఈరోజు అర్ధరాత్రి నుండి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో డెల్టా పరిధిలోని మూడు కాలువలు గురువారం ఉదయం నుండి మూసివేయనున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పది లక్షల 13వేల ఎకరాల వరి సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. రబీ పంటలు పూర్తయి కోతలకు రావడంతో సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు.…