Home
National News
National News News
-
Warning to Drinkers: తాగుబోతుల పరువు హుష్కాకి.. 52 వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్లో మాత్రం తాగుబోతులు… -
Hate Speech: మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం?.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు
రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. -
State Bank Of India: నిరుద్యోగులకు శుభవార్త.. 1,422 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
State Bank Of India: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఆయా పోస్టుల్లో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 7 వరకు ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్… -
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టిక్కెట్ క్యాన్సిల్ చేసుకోవాలని భావిస్తున్నారా?
IRCTC: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ అందించింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల జర్నీ క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వారు డబ్బులు నష్టపోకుండా ఐఆర్సీటీసీ చర్యలు చేపట్టింది. టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసేలా వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకోసం 24 గంటల ముందే టికెట్ ప్రింటవుట్ తీసుకుని కుటుంబ సభ్యుల ఐడీ కార్డుతో కలిపి రిజర్వేషన్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, కూతురు, కుమార్తె,… -
Indian Railways: ప్రత్యేక రైళ్లతో గత ఏడాది భారతీయ రైల్వేకు భారీ ఆదాయం.. ఎంతో తెలుసా?
Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత ఆర్ధిక ఏడాది ప్రత్యేక రైళ్ల ద్వారా భారతీయ రైల్వే రూ.17,526.48 కోట్ల ఆదాయం… -
Theft Case: 24 ఏళ్ల నాటి కేసు.. రూ.45 కొట్టేసినందుకు 4 రోజుల జైలు శిక్ష
Theft Case: దొంగతనం చేస్తే శిక్ష తప్పదు. అయితే చిన్నమొత్తంలో చోరీ చేస్తే ఎక్కడైనా పోలీసులు దండించి వదిలిపెట్టేస్తారు. మళ్లీ తప్పు చేయవద్దని హెచ్చరిస్తారు. అయితే రూ.45 దొంగతనం చేసినందుకు న్యాయస్థానం నాలుగురోజుల జైలుశిక్ష విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా 24 ఏళ్లకు ముందు జరిగిన ఈ చోరీ కేసులో ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడం గమనించదగ్గ విషయం. వివరాల్లోకి వెళ్తే.. 1998, ఏప్రిల్ 17వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి ఛపట్టీ… -
Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్
Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్లో నిర్మించనున్న వరల్డ్… -
Lottery Tickets: లాటరీ టిక్కెట్ల కోసం రూ.3.5 కోట్లు ఖర్చు.. చివరకు ఎంత గెలిచాడో తెలిస్తే షాకవుతారు
Lottery Tickets: కేరళలో లాటరీలు కొంతమందికి కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. ఇటీవల కేరళలో ఓ ఆటోడ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అతడికి రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అయితే అందరినీ అలాంటి అదృష్టం వరించదు. నాణేనికి బొమ్మ ఉన్నట్లే బొరుసు కూడా ఉంటుంది. నాణేనికి మరోవైపు పరిశీలిస్తే లాటరీ టిక్కెట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కష్టాలు పడే వాళ్లు కూడా ఉన్నారు. కేరళలోనే మరో వ్యక్తి 52 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు… -
Hyderabad: దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా మూడో స్థానంలో హైదరాబాద్
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు… -
Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!
Maharashtra: ప్రస్తుత రోజుల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాలు భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ నగదును ప్రజల సౌకర్యాల కోసం వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించడంలో దారుణంగా విఫలం అవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యను తీర్చలేదు. కానీ 19 ఏళ్ల యువతి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పని చేసి…
తాజావార్తలు
-
OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
-
CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
-
Off The Record: వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన రేపల్లె నియోజకవర్గం..
-
G 7 Summit: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ట్రంప్ భేటీ.. ఉక్రెయిన్-రష్యా వార్పై కీలక వ్యాఖ్యలు
-
Samantha: యాక్టర్గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!