Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ప్రస్తుత రోజుల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాలు భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ నగదును ప్రజల సౌకర్యాల కోసం వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించడంలో దారుణంగా విఫలం అవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యను తీర్చలేదు. కానీ 19 ఏళ్ల యువతి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంటోంది. తనకు తోచిన పద్ధతిలో ప్రజల సమస్యలను తీర్చుతూ బాసటగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఆ గ్రామం పేరు పాలట్ పడా. థానే జిల్లాలో ఈ గ్రామం ఉంది. అయితే పాలట్ పడాలో ఇప్పటికీ పాఠశాల లేదు.
Read Also: Samantha: సర్జరీ కోసం అమెరికాకు సమంత.. దేని కోసం ఇంకా..?
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
పాలట్ పడా గ్రామంలోని పిల్లలు చదువుకోవాలంటే కిలోమీటర్ దూరం నడిచి పక్క గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమ గ్రామంలో పాఠశాల నిర్మించాలని.. రోడ్డు వేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆ గ్రామానికి పాఠశాల, రోడ్డు రాలేదు. అయితే కంటా చింతామన్ అనే 19 ఏళ్ల యువతి తన సమస్యలతో పోరాటం చేస్తూనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆ తర్వాత చదువుకు దూరమైంది. చదువు విలువ తెలుసుకున్న ఆమె.. ఇతర విద్యార్థులు తనలా పాఠశాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నపాటి మర పడవను ఏర్పాటు చేసింది. చెరువు చుట్టూ తిరిగి.. రాళ్ల మార్గంలో బడికి వెళ్తున్న విద్యార్థులను తాను తయారు చేసిన పడవలో ఎక్కించుకుని పాఠశాలకు పంపుతోంది. ఇలా విద్యార్థులను తన పడవలో ఎక్కించుకున్నందుకు సదరు యువతి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకపోవడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా సుమారు 25 మంది గిరిజన కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటికైనా యువతిని చూసి అధికారులు కళ్లు తెరుస్తారేమోనని స్థానిక ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!