Hyderabad: దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా మూడో స్థానంలో హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. 2,568 నేరాలతో పుణే రెండో స్థానంలో ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో అట్టడుగున నిలవడం గమనించాల్సిన విషయం.
ఢిల్లీలో ప్రతి 10 లక్షల జనాభాకు 18,596 నేరాలు జరుగుతున్నాయి. దీంతో దేశంలో అత్యధిక నేరాల రేటును ఢిల్లీ కలిగి ఉంది. సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు అత్యధిక నేరాల రేటు గల మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ పొరుగున ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతి మిలియన్ జనాభాకు 4,272 నేరాలు జరుగుతున్నాయి. దేశంలో సురక్షితమైన నగరాల్లో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోల్కతాలో 104.4, పూణేలో 256.8, హైదరాబాద్లో 259.9 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 427.2 నేరాలు, ముంబైలో 428.4 నేరాలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
Read Also: Supreme Court: టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్.. యాంకర్లదే బాధ్యత..!
గత ఏడాది కోల్కతాలో 45, హైదరాబాద్లో 98, బెంగళూరులో 152, దిల్లీలో 454, ముంబైలో 162 హత్య కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది . హత్యాయత్నాలకు సంబంధించి కోల్కతాలో 135, హైదరాబాద్లో 192, బెంగళూరులో 371, దిల్లీలో 752, ముంబైలో 349 కేసులు నమోదయ్యాయి. అటు అత్యాచార కేసులకు సంబంధించి కోల్కతాలో 11, హైదరాబాద్లో 116, బెంగళూరులో 117, ఢిల్లీలో 1,226, ముంబైలో 364 కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి కోల్కతాలో 127, హైదరాబాద్లో 177, బెంగళూరులో 357, ఢిల్లీలో 1,023 కేసులు నమోదయ్యాయి.
జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం 2021 సంవత్సరంలో దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/oPCRPtP8QH
— AIR News Hyderabad (@airnews_hyd) September 21, 2022
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!